మల్కాజిగిరి, డిసెంబర్ 3: దివ్యాంగుల అభివృద్ధికోసం కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. శనివారం అల్వాల్ సర్కిల్ కార్యాలయంలో ‘ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం’ కార్యక్రమంలో ఎమ్మెల్యేకు కేక్ తినిపించిన పిల్లలు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మాట్లాడుతూ.. నియోజక వర్గంలోని దివ్యాంగులకు నెలనెల పింఛన్లు అందజేస్తున్నామని అన్నారు. దళితబంధు పథకంలో ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న ఒక దివ్యాంగునికి రూ.10లక్షలతో స్వయం ఉపాధి కోసం యూనిట్ను మంజూరు చేశామని అన్నారు. రెండో విడుత దళితబంధు పథకంలో దరఖాస్తు చేసుకున్న వారికి ప్రత్యేకంగా గుర్తించి వారిని పార్టీలకు అతీతంగా ఎంపిక చేస్తామని అన్నారు. అధికారులతో సర్వే చేయించి దివ్యాంగులను గుర్తిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీ నాగమణి, పీఓ ప్రభాకర్, కార్పొరేటర్లు సబితాకిశోర్, రాజ్ జితేంద్రనాథ్, అనిల్కిశోర్, బొబ్బిలి సురేందర్రెడ్డి, ఉదయ్కుమార్, రాజు, మధు, శ్రావణ్, వెంకటేశ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
‘టూల్ రూం’ ప్రారంభం
ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. శనివారం వెంకటాపురం డివిజన్ పద్మావతికాలనీ పార్కులో రూ.7లక్షలతో నిర్మించిన ‘టూల్ రూం’ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సబితాకిశోర్, డీఈఈ కార్తీక్, ఏఈ అరుణ్, అనిల్కిశోర్, గోపి, రాజేంద్రప్రసాద్, రవి, సంతోశ్, ఈఎస్ లక్ష్మణ్, రమ్, శివ, చంద్రశేఖర్, భాస్కర్, ప్రభాకర్, మోసిన్, సాయికుమర్, లక్ష్మి, ఉదయ్, స్వప్న, రమ, కల్పన తదితరులు పాల్గొన్నారు.
ఓటు హక్కు నమోదు చేసుకోవాలి
అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కోసం తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తెలిపారు. శనివారం అల్వాల్లో ఓటర్ల నమోదు పత్రాలను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రాధాన్యతను గుర్తించాలని అన్నారు. ఓటు చాలా విలువైనదని, వయోజనులైన ప్రతి ఒక్కరూ దాని గురించి అవగాహన పెంచుకోని, ఎన్నికల సమయంలో సరైన నాయకుడిని ఎన్నుకోవడానికి ఓటు వజ్రాయుధంలా పని చేస్తుందన్నారు. అలాగే ఓటరు లిస్ట్లో తప్పుడు ఉంటే సరిచేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అనిల్కిశోర్, రచయిత్రి కామేశ్వరి తదితరులు పాల్గొన్నారు.