బడంగ్పేట, నవంబర్ 28 : మౌలిక సమస్యల పరిష్కారానికి పెద్ద పీట వేస్తున్నామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 15,16,17 డివిజన్లలో పలు అభివృద్ధి పనులకు రూ.2కోట్లతో శంకుస్థాపనలు, ప్రారంభంత్సోవాలు చేశారు. సీఎన్ఆర్ కాలనీలో సీసీ రోడ్డు రూ.30లక్షలు, సీఎన్ఆర్కాలనీలో వాటర్ పైపులైన్ పనులు, ఆర్కిడ్ కాలనీలో సీసీ రోడ్డు రూ.30లక్షలు, 15డివిజన్, ఆర్కిడ్ కాలనీలో డ్రైనేజీ పైపులైన్ రూ.12లక్షలు, పద్మావతి కాలనీలో డ్రైనేజీ పైపులైన్, వెంకటేశ్వర కాలనీలో డ్రైనేజీ పైపులైన్ రూ.25లక్షలు, అంజిరెడ్డి కాలనీలో సీసీ రోడ్డు రూ.21లక్షలు, బాలాపూర్ పాత గ్రామంలో సీసీ రోడ్డుకు రూ.8లక్షలు, బాలాపూర్ పాత గ్రామంలో బీటీ రోడ్డు రూ.20లక్షలు, బాలాపూర్ పాత గ్రామంలో సీసీ రోడ్డుకు రూ.21లక్షలు, బాలాపూర్ గణేశ్ మండపం వద్ద సీసీ రోడ్డు రూ.15లక్షలు, బాలాపూర్ కమ్యూనిటీ హాల్ రూ.10క్షలు, రఘుహోమ్స్ కాలనీలో సీసీ రోడ్డు రూ.8లక్షల అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాలనీల్లో ఉన్న సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తున్నామన్నారు. పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులు చేయాలన్నారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ప్రధాన రహదారులను కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. బాలాపూర్ మండల పరిధిలో ఉన్న చెరువులను సుందరీకరణ చేయడం జరుగుతుందన్నారు. భవిష్యత్ తరాల కోసం చెరువులను కాపాడుకోవలసిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రాం శేఖర్, కమిషనర్ కృష్ణ మోహన్ రెడ్డి, డీఈ అశోక్ రెడ్డి, కార్పొరేటర్లు ఎర్ర మహేశ్వరి జైహింద్, బండారు మనోహర్, వంగేటి ప్రభాకర్ రెడ్డి, సూర్ణ గంటి అర్జున్, టీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.
కొత్తూరులో అయ్యప్ప పడి పూజ
కందుకూరు, నవంబర్ 28 : కొత్తూరు గ్రామంలో అయ్యప్ప మహాపడి పూజ ఘనంగా నిర్వహించారు. కర్నాటి ప్రభాకర్గౌడ్ 18వ పడి పూజ సందర్భంగా గురుస్వాములు చందర్ నాయర్, సతీశ్ నాయర్ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. కార్యక్రమానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, జిల్లా బీజేపీ అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, తల్లోజు ఆచారి, జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సురుసాని సురేందర్రెడ్డి, సర్పంచ్ పల్లె వసంతా కృష్ణాగౌడ్, ఏజీ అంజయ్యగౌడ్, లక్ష్మీనర్సింహారెడ్డి, ఆనంద్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సురుసాని రాజశేఖర్రెడ్డి, మండల కృష్ణ, యూత్ నాయకులు కార్తిక్, విజ్ఞేశ్వర్రెడ్డి, బొక్క దీక్షిత్రెడ్డి, బోసుపల్లి ప్రతాప్, ఎల్మటి దేవేందర్రెడ్డి, ఎంపీపీ మంద జ్యోతి పాండు, అయ్యప్పలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.