శేరిలింగంపల్లి, నవంబర్ 22: రాయదుర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వ హయాంలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తు కాలనీలు బస్తీలలో ప్రజలకు అవసరమైన చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. గతంలో ఎన్నడూలేని విధంగా రాయదుర్గంలో తెలంగాణ ప్రభుత్వ హయాంలో కొనసాగుతున్నాయి. రూ.40 లక్షలతో రాయదుర్గం హుస్సేన్ షావలి మైనారిటీ కాలనీలో, రూ.30 లక్షల వ్యయంతో ఎస్సీబస్తీలో సీసీరోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమ్యాయి. వీటి అనంతరం రూ.30 లక్షల వ్యయంతో వార్డు కార్యాలయం నుంచి రాయదుర్గం ప్రధాన రహదారి కామన్ వరకు సీసీరోడ్డును నిర్మించనున్నారు.
మూడు సీసీ రోడ్ల నిర్మాణం
రాయదుర్గంలో రూ.కోటి అంచనా వ్యయంతో మూడు సీసీ రోడ్ల నిర్మాణం చేపడుతున్నారు. రెండు దశల్లో ఈ పనులను కొనసాగిస్తున్నారు. గ్రామంలోని మూడు ప్రధాన రహదారులు సీసీరోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఇందుకోసం జేసీబీతో రహదారి చదనుచేసే పనులు ప్రారంభమయ్యాయి. వారం రోజులుగా పనులు జోరుగా కొనసాగుతన్నాయి. మరో వారం రోజుల్లో సీసీరోడ్డు పనులు పూర్తి చేసేందుకు జీహెచ్ఎంసీ యంత్రాంగం చర్యలు చేపడుతున్నది. రాయదుర్గంలోని ముస్లిం బస్తీ మసీద్ రహదారితో పాటు మరో రెండు అంతర్గత రహదారుల్లో సీసీరోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. మైనారిటీ బస్తీలోని యాదవ సంఘం భవనం నుంచి ఉర్ధూ మీడియం పాఠశాల వరకు, ఎస్సీ బస్తీలోని బొనమ్మ దేవాలయం నుంచి మల్కం చెరువు 100 అడుగుల రహదారి వరకు రెండు సీసీరోడ్ల పనులు ప్రస్తుతం వేగంగా కొనసాగుతున్నాయి. ఈ రెండు రహదారుల నిర్మాణం పూర్తిచేసిన రాయదుర్గం వార్డు కార్యాలయం నుంచి ప్రధాన రహదారి స్వాగత ద్వారం వరకు మూడో సీసీరోడ్డు పనులు చేపట్టాల్సి ఉంది.
టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అభివృద్ధి
తెలంగాణ ప్రభుత్వ హయాంలోనే రాయదుర్గంలో మౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగానే రాయదుర్గంలో రూ.కోటి వ్యయంతో పలు సీసీరోడ్డు అభివృద్ధి పనులు జోరందుకున్నాయి. హుస్సేన్ షావలి, ఎస్సీబస్తీ, వార్డు కార్యాలయ సమీపంలో సీసీరోడ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
– నరేశ్ దారుగుపల్లి,రాయదుర్గం వార్డు కమిటీ సభ్యుడు