అంబర్పేట/ కాచిగూడ/ గోల్నాక, నవంబర్ 6 : ప్రజలంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారనడానికి మునుగోడు ఉప ఎన్నికల ఫలితమే ప్రత్యక్ష సాక్ష్యమని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కూ సుకుంట్ల ప్రభాకర్రెడ్డి బంపర్ మెజార్టీలో విజయం సా ధించిన సందర్భంగా అంబర్పేట నియోజకవర్గంలోని నల్లకుంట డివిజన్ ఫీవర్ దవాఖాన చౌరస్తాలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబురాలు నిర్వహించారు.
నియోజకవర్గంలోని కాచిగూడ, నల్లకుం ట, గోల్నాక, అంబర్పేట, బాగ్అంబర్పేట డివిజన్ల నుం చి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై సంబురాలు నిర్వహించారు. పెద్ద ఎత్తున పటాకులు కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం ఎమ్మెల్యే కాలేరు మాట్లాడుతూ.. మునుగోడు ప్రజలంతా సీఎం కేసీఆర్ వెంటే ఉన్నారని ఈ ఫలితం రుజువు చేసిందని చెప్పారు. అభివృద్ధిని చేసే పార్టీని గుండెకు హత్తుకున్నారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ అధ్యక్షులు మేడి ప్రసాద్, సీహెచ్ చంద్రమోహన్, భీష్మాదేవ్, సిద్ధార్థ్ముదిరాజ్, సీనియర్ నాయకులు రమేశ్నాయక్, రామారావుయాదవ్, మిర్యాల రవీందర్, ఆర్కేబాబు, నరేందర్, రాముయాదవ్ తదితరులతో పాటు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నల్లకుంట డివిజన్ టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు గోనె ప్రదీప్రావు నేతృత్వంలో తిలక్నగర్లో సంబురాలు జరుపుకున్నారు. ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. ఇందులో వంగపల్లి రమేశ్రావు, అశోక్రావు, రవీందర్రావు, అక్కినపల్లి రమేశ్, వంగపల్లి అశోక్రావు, వెంకటరామారావు తదితరులు పాల్గొన్నారు.
గోల్నాకలో… గోల్నాక డివిజన్ కార్పొరేటర్ దూసరి లావణ్యశ్రీనివాస్గౌడ్ నేతృత్వంలో ఛే నంబర్ చౌరస్తాలో విజయోత్సవ సంబురాలను నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పటాకులు కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. ఎక్కడ ఎన్నికలు జరిగినా టీఆర్ఎస్దే విజయమని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నర్సింగ్యాదవ్, రాజు, లక్ష్మణ్, గోపాల్రెడ్డి, ఉమేశ్, గోపాల్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.