సిటీబ్యూరో, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): ఎన్నో ఏండ్ల నుంచి ఉన్న వరదముంపు సమస్య సమగ్ర నాలా అభివృద్ధి కార్యక్రమం (ఎస్ఎన్డీపీ) తో శాశ్వతంగా పరిషారం అవుతుందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం సనత్నగర్ నియోజకవర్గ పరిధి బేగంపేట డివిజన్లో గల పికెట్ నాలాపై ఎస్ఎన్డీపీ కార్యక్రమం కింద రూ.10 కోట్ల వ్యయంతో నిర్మించిన వంతెనను ప్రారంభించిన అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ మాట్లాడారు.
నగరాభివృద్ధే లక్ష్యంగా..
నగర అభివృద్ధికి సీఎం కేసీఆర్ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, దేశంలో ప్రధాన నగరాలు ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు తదితర నగరాల కంటే హైదరాబాద్ ఎక్కువగా అభివృద్ధి చెందినట్లు ఆయన చెప్పారు. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ఎగువ నుంచి వరదతో పికెట్ నాలా పరిసర కాలనీల ప్రజలు ముంపునకు గురై అనేక ఇబ్బందులు పడేవారని గుర్తు చేశారు. సమస్య శాశ్వత పరిషారం కోసం ఎస్ఎన్డీపీ కింద రూ.10 కోట్ల వ్యయంతో నూతన బ్రిడ్జి నిర్మించామని చెప్పారు. ఈ పనులను అనుకున్న సమయానికి ముందే పూర్తి చేయడం పట్ల మంత్రి అధికారులను అభినందించారు.
వందలాది కాలనీలకు ఉపశమనం..
ఎన్నో సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోని నాలాలతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదురొన్నారని, ఈ సమస్యలకు శాశ్వత పరిషారం చూపాలనే గట్టి సంకల్పంతో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ఎస్ఎన్డీపీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. ఎస్ఎన్డీపీ ద్వారా వందల కోట్ల రూపాయల వ్యయంతో నగరంలోని అనేక నాలాల అభివృద్ధి, పునరుద్ధరణ పనులను చేపట్టినట్లు వివరించారు. పికెట్ నాలా పై బ్రిడ్జి నిర్మాణంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ లోని దాదాపు 40 కాలనీల ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా బేగంపేట నాలా అభివృద్ధి పనులు కూడా రూ.46 కోట్ల వ్యయంతో వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. అక్రమ నిర్మాణాల తొలగింపుతో నిరాశ్రయులుగా మారుతున్న వారికి ప్రత్యామ్నాయ పునరావాస సౌకర్యాలు కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని పేర్కొన్నారు.
వాహనదారులకు ధన్యవాదాలు : మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
ఎస్ఎన్డీపీతో చేపడుతున్న పనులు ఒక్కొక్కటి అందుబాటులోకి వస్తున్నాయని, కొన్ని పనులు 80శాతం వరకు పూర్తయిన నేపథ్యంలో ఆ పనులను వేగవంతం చేయాలని అధికారులను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆదేశించారు. పికెట్ నాలా బ్రిడ్జి నిర్మాణం సకాలంలో పూర్తి అయ్యేందుకు వాహనదారులు సహకరించారని, ఇందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మేయర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ శ్రీలత రెడ్డి, ఎమ్మెల్యే సాయన్న, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, కార్పొరేటర్లు మహేశ్వరి, కొలన్ లక్ష్మి, మాజీ కార్పొరేటర్లు నామన శేషుకుమారి, ఉప్పల తరుణి, ఎస్ఎన్డీపీ సీఈ కిషన్, ఎస్ఈ భాసర్ రెడ్డి, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, వాటర్ వర్స్ జీఎం రమణారెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ జ్ఞానేందర్ రెడ్డి, సీఐ లింగేశ్వర్ రావు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ వచ్చాకే నగరాభివృద్ధి జరిగింది
కేసీఆర్ అధికారం చేపట్టిన తర్వాత హైదరాబాద్ నగరంలో అభివృద్ధి చూశాం..అండర్పాస్ రోడ్లు, వంతెనలు, జంక్షన్ల బ్రిడ్జిలు, నాలాలపై లోతుగా ఉన్న ప్రాంతాల్లో వంతెనలు కట్టి మురికినీరు, వర్షం నీరు సాఫీగా వెళ్లేందుకు చేసిన అభివృద్ధి ఇప్పటి వరకు బాగా జరిగింది.గతంలో బేగంపేట్లో భారీ వర్షం పడితే చాలు రోడ్లు చెరువులయ్యేవి. ఇప్పుడా ఆ సమస్య తీరింది.
ట్రాఫిక్ కష్టాలు ఉండవిక
భారీ వర్షం కురిసిన ప్రతిసారి రసూల్పుర జంక్షన్ వద్ద ప్యాట్నీ నాలా ఉప్పొంగుతుండేది. దీంతో రోడ్డుకిరువైపుల నీరు నిలిచి గంటల పాటు ట్రాఫిక్ నిలిచిపోతుండేది. ప్రస్తుతం ట్రాఫిక్ కష్టాలు తప్పాయి. వర్షం కురిసినా.. బాధ లేదిక.