నాంపల్లి, అక్టోబర్ 12 : ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధికి నోచుకోని పల్లెలు స్వరాష్ట్రంలో అభివృద్ధిపథంలో దూసుకుపోతున్నాయని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. బుధవారం నాంపల్లి మండలకేంద్రంలోని నక్క సునంద ఫంక్షన్ హాల్లో టీఆర్ఎస్ జిల్లా నాయకుడు పానుగంటి వెంకన్నగౌడ్ అధ్యక్షతన నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి మంత్రి హాజరై మాట్లాడారు. ఫ్లోరోసిస్ నుంచి ప్రజలను కాపాడిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. ఏనాడూ అసెంబ్లీలో ప్రజల సమస్యల గురించి మాట్లాడని రాజగోపాల్రెడ్డి నేడు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని అన్నారు. పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచిన బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ ఏవిధంగా అభివృద్ధి చేస్తాడు? నిధులు ఎక్కడి నుంచి తెస్తాడో సమాధానం చెప్పాలన్నారు. మునుగోడులో అభివృద్ధి పనులు జరుగాలంటే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని గెలిపించాలన్నారు. టీఆర్ఎస్ జిల్లా నాయకుడు పానుగంటి వెంకన్న గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్, బీజేపీలకు చెందిన 50 మంది మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో గెర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్, జడ్పీటీసీ ఎలుగోటి వెంకటేశ్వర్రెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ ఏడుదొడ్ల రవీందర్రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కుంభం కృష్ణారెడ్డి, ఈటం వెంకట్రెడ్డి, నాంపల్లి సత్తయ్య, నక్క చంద్రశేఖర్, బెల్లి సత్తయ్య, కుంభం శ్రీధర్రెడ్డి, గాదపాక రమేశ్, కర్నె యాదయ్య పాల్గొన్నారు.