శంషాబాద్ రూరల్/బండ్లగూడ/మైలార్దేవ్పల్లి, అక్టోబర్ 5: తెలంగాణ రాష్ట్ర సమితిని దేశ వ్యాప్తంగా విస్తరించడం కోసం బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు బీఆర్ఎస్ (భారత్ రాష్ట్ర సమితి)ని ఏర్పాటు చేశారు. దీంతో శంషాబాద్లో నార్సింగి మార్కెట్ కమిటి చైర్మన్ వెంకటేశ్ గౌడ్ ఆధ్వర్యంలో పార్టీని స్వాగతిస్తు బాణాసంచాలు కాల్చుతు సంబురాలు జరుపుకున్నారు. ‘దేశ్కి నేత కేసీఆర్’ అంటూ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సుష్మ, గణేశ్గుప్త, కౌన్సిలర్లు చెన్నం ఆశోక్, మేకల వెంకటేశ్, కుమార్, అమృతారెడ్డి, మాజీ సర్పంచ్ జిట్టె సిద్ధులు, నాయకులు మంచర్ల శ్రీనివాస్, తాజ్బాబా, హన్మంతు, మురళియాదవ్, రాజేందర్, అంజాద్బాయి, చిక్కిరి శేఖర్, ప్రవీణ్, ప్రశాంత్రెడ్డిలతో పాటు పలువురు పాల్గొన్నారు.
టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారి నేపథ్యంలో బుధవారం శంషాబాద్ మండలంలోని పాలమాకులలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు సంబురాలు నిర్వహించారు. గ్రామంలోని మహానీయుల విగ్రహాలకు పూలమాలలు వేయడంతో పాటు గ్రామంలో ర్యాలీ నిర్వహించి బీఆర్ఎస్ ఏర్పాటుపైతో దేశ వ్యాప్తంగా ప్రజలకు కేసీఆర్ సేవలు చేస్తారని నాయకులు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జయమ్మశ్రీనివాస్, జడ్పీటీసీ తన్విరాజు, పార్టీ మండలాధ్యక్షుడు కే.చంద్రారెడ్డి, వైస్ ఎంపీపీ నీలంనాయక్, ఎంపీటీసీలు ఇందిరా కృష్ణగౌడ్, సరితరవీందర్, ఉప సర్పంచ్ ప్రవీణ్గౌడ్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత్ రాష్ట్ర సమితిగా ప్రకటించడంతో రాజేంద్రనగర్లో బీఆర్ఎస్ (టీఆర్ఎస్) నేతలు ఘనం గా సంబరాలను జరుపుకున్నారు. దేశ్కి నేత కేసీఆర్ అంటు నినాదాలు చేస్తు ర్యాలీలను నిర్వహించారు. డైరీఫాం చౌరస్తాలో కార్పొరేటర్ అర్చన జయప్రకాశ్, ధర్మరెడ్డి ఆధ్వర్యంలో టపాసులు కాల్చి, మిఠాయిలు పంచుకుని సంబురాలు జరుపుకున్నారు. రాజేంద్రనగర్, బండ్లగూడ, హిమాయత్సాగర్, పిరం చెరువు, కిస్మత్పూర్, హైదర్షాకోట్ తదితర ప్రాంతాలలో బీఆర్ఎస్ నాయకులు సంబురాలను చేసుకుని ఆనందోత్సవాలల్లో మునిగిపోయారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాపయ్య యాదవ్, రాపోలు సత్తయ్య, సయ్యద్ ముజమిల్ అహ్మద్, చలసాని విష్ణుముర్తి, మహేశ్, షౌకత్, సాయిగౌడ్, కోరని రవీందర్, గౌతమ్, అబ్బాస్ ఖాన్, తదితరులు పాల్గొన్నారు.
దేశ రాజకీయాలలో దశ దిశ మార్చే సత్తా కేసీఆర్కే ఉన్నదని మైలార్దేవ్పల్లి డివిజన్ బీఆర్ఎస్ (టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షుడు టి ప్రేమ్గౌడ్ అన్నారు. బుధవారం మైలార్దేవ్పల్లి డివిజన్ శివాజీ చౌక్ చౌరస్తాలో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారిన నేపథ్యంలో పార్టీ శ్రేణులతో కలిసి బాణాసంచా కాల్చి సంబురాలు చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో సరికొండ వెంకటేశ్, గుమ్మడి కుమార్, యంజాల మహేష్రాజ్, రాజు ముదిరాజ్, లక్ష్మిరాజ్ , లలిత, పుష్ప, శ్రీనివాస్రెడ్డి, అంజనేయులుగౌడ్, యంజాల శేఖర్, నాని తదితరులు పాల్గొన్నారు.