సైదాబాద్, అక్టోబర్ 5 : సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి అడుగుపెడుతూ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని భారత్ రాష్ట్ర సమితి జాతీయ పార్టీగా ప్రకటించినందుకు పటాకులు కాల్చి మిఠాయిలు పంచి పార్టీ శ్రేణులు ఐఎస్ సదన్ చౌరస్తాలో సంబురాలు జరుపుకున్నారు. యాకుత్పురా నియోజక వర్గం బీఆర్ఎస్( టీఆర్ఎస్) ఇన్చార్జి సామ సుందర్ రెడ్డి మాట్లాడుతూ.. విజయందశమి పర్వదినం సందర్భంగా మహానాయకుడు సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ జాతీయ పార్టీ ఏర్పాటు చేసిన శుభ పరిణామన్నారు. కార్యక్రమంలో నాయకులు మైల్కోల్ మహేందర్ యాదవ్, దర్శనం నర్సింగ్రావు, శ్రీనివాస్, ప్రవీణ్, భాస్కర్ రెడ్డి, కార్తీక్ గౌడ్, రాము పాల్గొన్నారు. భారతదేశ రాజకీయాలకు బీఆర్ఎస్ పార్టీయే దిక్సూచి అని సైదాబాద్ మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి స్వర్ణలతారెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ప్రకటించటంపై ఆమె సంతోషాన్ని వ్యక్తం చేశారు. దేశానికి కాబోయే ప్రధానమంత్రి కేసీఆర్ అని, ఆయన సారథ్యంలో దేశం అన్ని రంగాల్లో ముందుకు సాగుతుందన్నారు.
దేశానికి మంచిరోజులు రాబోతున్నాయి
చాదర్ఘాట్, అక్టోబర్ 5 : దేశానికి మంచిరోజులు రాబోతున్నాయని మలక్పేట నియోజకవర్గం పార్టీ ఇన్చార్జి ఆజంఅలీ అన్నారు. టీఆర్ఎస్ను బీఆర్ఎస్ గా మార్చిన సీఎం కేసీఆర్తో విప్లవాత్మక మార్పులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం ఆజం అలీ నేతృత్వంలో టీఆర్ఎస్ భవన్కు నాయకులు భారీగా తరలి వెళ్లారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు కామేశ్, కారింగల మారుతి, జగన్, హయత్ హుస్సేన్ హబీబ్, నేతలు పగిళ్ల నర్సింగ్, బాబు సుదర్శన్, దానకర్ణాచారి, సాయ భువనేశ్వరి పాల్గొన్నారు.
అంబరాన్నంటిన సంబురాలు..
టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా సీఎం కేసీఆర్ ప్రకటించడంతో పార్టీ శ్రేణుల్లో సంబురాలు అంబరాన్నంటాయి. నాయకులు చాదర్ఘాట్ చౌరస్తాలో ఆజంఅలీ నేతృత్వంలో పటాకులను పేల్చి స్వీట్లను పంపిణీ చేశారు.