ఉప్పల్జోన్ బృందం, అక్టోబర్ 5 : టీఆర్ఎస్ పార్టీని భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)గా ప్రకటించిన నేపథ్యంలో బుధవారం ఉప్పల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, శ్రేణులు పటాకులు కాల్చి సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకాలు చేసి.. మిఠాయిలు పంచిపెట్టుకున్నారు. జై భారత్.. జై తెలంగాణ.. జై కేసీఆర్ నినాదాలతో ఉప్పల్ నియోజకవర్గ ప్రాంతం మారుమోగింది. ఉప్పల్, నాచారం, హబ్సిగూడ, రామంతాపూర్, చిలుకానగర్, ఏఎస్రావునగర్, మల్లాపూర్, హెచ్బీకాలనీ, చర్లపల్లి, కాప్రా డివిజన్లలో కార్పొరేటర్లు, నేతలు, కార్యకర్తలు సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ.. దేశ ప్రజల సంక్షేమం కోసమే సీఎం కేసీఆర్.. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చారని అన్నారు. బీజేపీ పాలనలో పేదలు విసిగిపోయారని, రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను దేశ వ్యాప్తంగా అమలు చేసే విధంగా సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి తగిన బుద్ధి చెప్పేందుకు దేశ వ్యాప్తంగా ప్రజలు ఎదురుచూసున్నారన్నారు
వేముల సంతోష్రెడ్డి ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచారు. ఈ కార్యక్రమంలో మస్క సుధాకర్, టంటం వీరేశ్, వెంకటేశ్, ప్రవీణ్, సత్యపాల్రెడ్డి, వెంకటేశ్వర్రావు, వేముల వెంకట్రెడ్డి, జహంగీర్, వంశీ, భరత్రెడ్డి పాల్గొన్నారు.
జరిగిన సంబురాల్లో పల్లె నర్సింగ్రావు , కొంపెల్లి రవీందర్, ఆకిటి బాల్రెడ్డి, జెల్లి మోహన్, అఫ్సర్ బాయ్, ఇర్షాద్ఖాన్, ప్రవీణ్, శ్రీకాంత్చారి, నరేశ్, సతీశ్ పాల్గొన్నారు. నాచారంలో మేకల ముత్యంరెడ్డి ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించారు.
డివిజన్ , రాధిక చౌరస్తాలో జరిగిన సంబురాల్లో నాయకులు పెద్దాపురం కుమారస్వామి, బేతాల బాల్రాజు, శేర్మణెమ్మ, లక్ష్మీనారాయణ, కొండూరి మురళీపంతులు, శిరీషారెడ్డి, మల్కా రమాదేవి, దుర్గ, మాధవి, మంజులారెడ్డి, రామతులసీ, సత్యమ్మ, బాల్ రాజు, బాల్నర్సింహ, కందాడి సుదర్శన్రెడ్డి, ఏనుగు సీతారామిరెడ్డి, బాల్శెట్టి, గడ్డం శ్రీను, చిన్నయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
డివిజన్, చక్రీపురం చౌరస్తాలో కార్పొరేటర్ బొంతు శ్రీదేవి ఆధ్వర్యంలో టపాసులు కాల్చి, మిఠాయిలు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ గొల్లూరి అంజయ్య, నాయకులు నాగిళ్ల బాల్రెడ్డి, బొడిగె ప్రభుగౌడ్, పాండాల శివకుమార్గౌడ్, కనకరాజుగౌడ్, బత్తుల శ్రీకాంత్యాదవ్, బాబు గంగపుత్ర, కొమ్ము రమేశ్, నర్సింహ వంశరాజు, కొమ్ము సురేశ్, బాల్నర్సింహ, రాఘవరెడ్డితదితరులు పాల్గొన్నారు.
చౌరస్తాలో మాజీ కార్పొరేటర్ ధన్పాల్రెడ్డి, డప్పు గిరిబాబు ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు సారా అనిల్, సీసీఎస్ ప్రతినిధి పద్మారెడ్డి, నాయకులు జాండ్ల ప్రభాకర్రెడ్డి, సుధీర్కుమార్, యాదగిరి, వంశీరాజు, రెడ్డినాయక్, మంద చంద్రమౌళి, కర్రె సత్యనారాయణ, గంప కృష్ణ, చల్లా వెంకటేశ్, ఎస్కే కరీం, రాకేశ్, శ్యామ్, నవనీత, కిష్టమ్మ, జ్యోతి, రఫీక్, బాల్నర్సింహ పాల్గొన్నారు.
మాజీ కార్పొరేటర్ గంధం జ్యోత్స్న నాగేశ్వర్రావు ఆధ్వర్యంలో పూనం భవన్లో మైనార్టీలకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో నాయకులు చిట్టి, తూటి నర్సింహ, సాయి, మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. అలాగే.. రామంతాపూర్ డివిజన్ ప్రధాన రహదారిలో ఎండీ ముస్తాక్ ఆధ్వర్యంలో టపాసులు కాల్చుతూ, స్వీట్లు పంచుతూ దేశ్కినేత కేసీఆర్ ఆంటు నినాదాలు చేశారు.
డివిజన్లో డాక్టర్ బీవీ చారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో నాయకులు నందికంటి శివ, శ్రీధర్, రవినాయక్, లిం గానాయక్, ఆద్వైత్రెడ్డి, యాదమ్మ, ధనలక్ష్మి, భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.
తాసీల్దార్ కార్యాలయం చౌరస్తాలో కార్పొరేటర్ స్వర్ణరాజు నేతృత్వంలో పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో నాయకులు ఎంకే బద్రుద్దీన్, పవన్కుమార్, కొప్పులకుమార్, బంక వెంకటేశ్, బైరి భాస్కర్గౌడ్, రేగళ్ల సతీశ్రెడ్డి, మల్లారెడ్డి, ఎండీ గౌస్, ఎండీ అలీ, కృష్ణాగౌడ్, వంశరాజ్ రాజేశ్, రాయ్ పాల్గొన్నారు.
డివిజన్లో కార్పొరేటర్ పన్నాల దేవేందర్రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు పటాకులు కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో వాసుగౌడ్, కోటేశ్వరి, ధర్మారెడ్డి, కుంటి కృష్ణ, నెమలి రవి, తదితరులు పాల్గొన్నారు.
హెచ్బీకాలనీ డివిజన్లో కార్పొరేటర్ జెర్రి పోతుల ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్ శ్రీనివాస్రెడ్డిల ఆధ్వర్యంలో నాయకులు సంబురాలు జరుపుకున్నారు.