సిటీబ్యూరో, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): స్థానిక ప్రజల సంస్కృతులు, సంప్రదాయాలను ప్రేమించే స్వభావం ఉండాలని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. మంగళవారం మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (మనూ)లో హెచ్కే షేర్వాణి సెంటర్ ఫర్ డెక్కన్ స్టడీస్ (హెచ్కేఎస్-సీడీఎస్), ఆధ్వర్యంలో మంగళవారం సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా నిర్వహించిన ‘సవాస్-ఎ-హయత్’ అనే చారిత్రాత్మకప్రదర్శనకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ నాటకం 17వ శతాబ్దంలో గోల్కొండ కుతుబ్షాహి పాలకురాలు స్వీన్ హయత్ బక్షి బేగం జీవిత చరిత్ర ఆధారంగా ఈ నాటకాన్ని అంతర్జాతీయ గుర్తింపు పొందిన ఖాదిర్ అలీబేగ్ థియేటర్ ఫౌండేషన్ ప్రదర్శించింది. కార్యక్రమం ఆ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ సయ్యద్ ఐనుల్ హసన్, పద్మశ్రీ మహమూద్ అలీబేగ్, హెచ్కేఎస్-సీడీఎస్ డైరెక్టర్ ప్రొఫెసర్ సల్మా అహ్మద్ ఫరూఖీ పాల్గొన్నారు.