మల్కాజిగిరి, అక్టోబర్ 4: తెలంగాణలో అమలు పరుస్తున్న సంక్షేమ ఫలాలు.. దేశ ప్రజలందరికీ అందించడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. మంగళవారం అల్వాల్లో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమం త్రి కేసీఆర్ తెలంగాణలో వ్యవసాయరంగానికి ఉచితంగా విద్యుత్ను అందజేస్తున్నారని, దీన్ని దేశమంతటా అమలు చేయడమే ఆయన ధ్యేయమని అన్నారు. దేశంలోని వ్యవసాయరంగాన్ని గాడిలో పెట్టడానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, జాతీయ పార్టీతో ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టనున్నారని అన్నారు. ఇందుకు ప్రజలు అండగా ఉండాలని అన్నారు. దేశంలోని పేద, బడుగు వర్గాల సంక్షేమం కోసం తపించిపోతున్నారన్నారు.
దళితుల అభివృద్ధికోసం దళితబంధు పథకం కింద రూ.10లక్షలతో స్వయం ఉపాధికోసం యూనిట్లను మం జూరు చేశారని అన్నారు. నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా ఇప్పటికే వంద మంది దళిత కుంటుంబాలు లబ్ధిపొందాయని, రానున్న రోజుల్లో మరో 500 మంది దళితులను ఎంపికచేస్తామని అన్నారు. తెలంగాణలో సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందిస్తున్నామని, దేశంలోని పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందాలని సీఎం కేసీఆర్ కోరుకుంటున్నారని అన్నారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, దివ్యాంగులు, ఇతర బాధితులకు నెలనెలా పింఛన్లు అందజేస్తున్నామని అన్నారు. అనిల్కిశోర్ గౌడ్, మధుసూదన్ రెడ్డి రాజసింహారెడ్డి, బలంతరెడ్డి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
‘మల్కాజిగిరి’ అభివృద్ధే లక్ష్యం
మల్కాజిగిరి ని యోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యమని స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి హ న్మంతరావు అన్నారు. నిజామాబాద్ జన్నపల్లిలో ఎమ్మెల్యే గత తొమ్మిది రోజులుగా అమ్మవారి దీక్షలో ఉ న్నారు. అందులో భాగంగా మంగళవారం మల్కాజిగిరి టీఆర్ఎస్ సర్కిల్ ప్రెసిడెంట్ పిట్ల శ్రీనివాస్, ఇతర నేతలు దుర్గామాత పూజకు హాజరై ఎమ్మెల్యేను కలిశారు.