ఉప్పల్, అక్టోబర్ 4 : వచ్చే మునుగోడు ఉప ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగురవేస్తామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. మంగళవారం హబ్సిగూడలోని క్యాంపు కార్యాలయంలో కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ ముందుకుసాగుతున్నారని అన్నారు. మునుగోడు ఉపఎన్నికల సందర్భంగా నియోజకవర్గం నుంచి ప్రచారానికి తరలివెళ్తున్నామని చెప్పారు. తెలంగాణ ప్రభు త్వం చేపడుతున్న ప్రజాసంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి, టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు పన్నాల దేవేందర్రెడ్డి, స్వర్ణరాజ్, జెర్రిపోతుల ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్లు గుండారపు శ్రీనివాస్రెడ్డి, కొత్త రామారావు, సింగిరెడ్డి ధన్పాల్రెడ్డి, నేతలు సాయిజెన్ శేఖర్, డివిజన్ అధ్యక్షుడు వేముల సంతోశ్రెడ్డి, కాసం మహిపాల్రెడ్డి, పల్లా కిరణ్కుమార్రెడ్డి, మేకల ముత్యంరెడ్డి, సుడుగు మహేందర్రెడ్డి, పల్లె నర్సింగ్రావు, డాక్టర్ బీవీ చారి, డప్పు గిరిబాబు, ఎండీ ముస్తాక్, నేతలు గిల్పర్ట్, తదితరులు పాల్గొన్నారు.