కొండాపూర్, అక్టోబర్ 2 : గిరిజన కుటుంబాల్లో వెలుగులు నింపేలా రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నదని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. గిరిజనుల రిజర్వేషన్లను 10 శాతానికి పెంచుతూ సీఎం కేసీఆర్ జీవోలను విడుదల చేయడంతో ఆదివారం చందానగర్లో కేసీఆర్ చిత్రపటానికి కార్పొరేటర్లు మంజుల రఘునాథరెడ్డి, శ్రీకాంత్, గిరిజన సోదరులతో కలిసి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా విప్ గాంధీ మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అన్ని వర్గాలను అభివృద్ధి పథంలో తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. గిరిజనుల రిజర్వేషన్లను 10 శాతానికి పెంచి వారి కుటుంబాల్లో వెలుగులు నింపిన గొప్పదనం సీఎం కేసీఆర్కు దక్కిందన్నారు. రిజర్వేషన్ పెంపుతో గిరిజన ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. అందరిని అన్ని విధాల ఆదుకునేలా రాష్ట్రం ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రవేశపెడుతున్నదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు రవీందర్రావు, లక్ష్మీ నారాయణగౌడ్, మాజీ కార్పొరేటర్ అశోక్గౌడ్, చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథరెడ్డి, నాయకులు రాఘవరావు, హరీష్రావు, జనార్దన్రెడ్డి, కరుణాకర్గౌడ్, గోపి, మల్లారెడ్డి, శ్రీనివాస్ నాయక్, వెంకటేశ్, ప్రవీణ్, చరణ్దూబే, మల్లేశ్, ధనలక్ష్మీ, ప్రీతమ్, శ్రీకాంత్, సునీత, ఉదయ్, అక్బర్ఖాన్ పాల్గొన్నారు.