మల్కాజిగిరి, అక్టోబర్ 1: మతసామరస్యానికి పండుగలు ప్రతీక అని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. శనివారం అల్వాల్లో బతుకమ్మ సంబురాల్లో ఆయన పాల్గొన్నా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ సంబురాలను ఆనందోత్సవాలతో జరుపుకోవడానికి చీరలను అందజేశారని అన్నారు. రాష్ట్రంలోని అన్ని పండు గలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం హర్షణీయమన్నారు. దేశ ప్రజల సంక్షేమం కోరుకుంటున్న సీఎం కేసీఆర్.. దేశ రాజకీయాల్లోకి వస్తే పరిస్థితులు మారనున్నాయని అన్నారు. ప్రజల సంక్షేమం కోసం తపిస్తున్న సీఎం కేసీఆర్ నిర్ణయాలను ప్రజలు స్వాగతిస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను స్థానికులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రాజ్ జితేంద్రనాథ్, ప్రేమ్కుమార్, అనిల్కిశోర్, శ్రీనివాస్, ప్రసాద్, వెంక న్న, భాగ్యనందరావు తదితరులు పాల్గొన్నారు.