బడంగ్పేట, అక్టోబర్ 1: సీఎం కేసీఆర్తోనే బతుకమ్మకు ప్రాధాన్యత పెరిగిందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడ చందన చెరువు కట్టపై పార్టీలకు అతీతంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బతుకమ్మ ఆడిన చిన్నారులకు బహుమతులను అందజేశారు. సంద చెరువు ప్రాంతం జనసంద్రంగా మారింది. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో చందన చెరువు మారు మోగింది. మహిళలు సంతోషంగా ఉత్సాహంగా బతుకమ్మ కార్యక్రమంలో ఆడిపాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ట్యాంక్ బండ్ రోడ్డు నిలిపివేసి బతుకమ్మలు ఆడటం.. అదే విధంగా అతి సుందరంగా తీర్చిదిద్దిన సందె చెరువు వద్ద ఈ యేడు బతుకమ్మ సంబురాలు జరుపుకోవాలని పిలుపు నిచ్చారు.
సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత బతుకమ్మ పండుగకు ప్రాధాన్యత వచ్చిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ బిడ్డలు ఎక్కడ ఉన్నా కూడా బతుకమ్మ ప్రాధాన్యతను తెలిపిన ఘనత సీఎం కేసీఆర్దే అన్నారు. బతుకమ్మ ఆటతో చెరువు ప్రాంతమంతా కన్నుల పండుగా ఉందన్నారు. భవిష్యత్లో ఇక్కడే వేలాది మంది బతుకమ్మను ఆడుకోవాలని ఇక్కడ ప్రారంభించామన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ దుర్గా దీప్లాల్ చౌహాన్, డిఫ్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, కమిషనర్ నాగేశ్వర్, ప్లోర్ లీడర్ భూపాల్రెడ్డి, సిద్దాల లావణ్య, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కామేశ్రెడ్డి, కార్పొరేటర్లు, కో -ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.