సిటీబ్యూరో, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ):ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థులు వినూత్న ఆవిష్కరణలపై దృష్టి సారించాలని నీతి అయోగ్ సభ్యులు డాక్టర్ వీకే సారస్వత్ పిలుపునిచ్చారు. అందుకోసం అవసరమైన ప్రోత్సాహం అందిస్తామన్నారు. శనివారం జేఎన్టీయూ హైదరాబాద్లో నిర్వహించిన యూనివర్సిటీ గోల్డెన్ జూబ్లీ ముగింపు వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొదటి సెమిస్టర్ బీటెక్ విద్యార్థులు మధ్యలో సెమిస్టర్ బ్రేక్ తీసుకుని ఇన్నోవేటివ్ ఆలోచనలపై దృష్టి సారించాలన్నారు. ఆ విద్యార్థులకు అవసరమైన సహకారం అందించడంతో పాటు వారికి ఆరు క్రెడిట్లు కేటాయిస్తామన్నారు.
హైదరాబాద్లో పర్యావరణ పరిరక్షణ దిశగా సమిష్టిగా ఏం చేయాలనే అంశాలపై ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఐఐటీ హైదరాబాద్లో పర్యావరణ పరిరక్షణ కోసం స్కూల్ ఆఫ్ సస్టెయినబిలిటీ అండ్ ైక్లెమేట్ చేంజ్ ఏర్పాటు చేయడం వల్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఐఎస్టీ కార్యదర్శి శ్రీవరి చంద్రశేఖర్, డీజీపీ మహేందర్రెడ్డి, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి, ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్ మూర్తి, ఎన్ఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్.వి.రమణరావు, జేఎన్టీయూ వీసీ ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి, రెక్టార్ ప్రొఫెసర్ గోవర్ధన్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మంజూర్హుస్సేన్, సెయింట్ వ్యవస్థాపకులు బీవీఆర్ మోహన్రెడ్డి ఏపీపీఎస్సీ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ వెంకట్రామ్రెడ్డి,పూర్వ విద్యార్థులు, వర్సిటీ హెచ్వోడీ విద్యార్థులను ఉద్దేశించి పలు అంశాలపై మాట్లాడారు.