శామీర్పేట,ఘట్కేసర్, కలెక్టరేట్, సెప్టెంబర్ 30 : మండల పరిషత్ కార్యాలయం, పోచారం మున్సిపాలిటీ కార్యాలయం, జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మహిళా ఉద్యోగులు, సిబ్బంది బతుకమ్మ సంబురాల్లో పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి తదితరులు మహిళా ఉద్యోగులతో కలిసి ఉత్సాహంగా పాడారు. జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి ఝాన్సీరాణి, పంచాయతీరాజ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రామ్మోహన్ రావు, ఏఓ వెంకటేశ్వర్లు, అధికారులు పాల్గొన్నారు.
మేడ్చల్ రూరల్, సెప్టెంబర్ 30 : మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల మెయిన్ క్యాంపస్, మల్లారెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్(ఎంఆర్ఐటీఎస్)లో బతుకమ్మ సంబురాలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎంఆర్ఐటీఎస్లో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో మంత్రి మల్లారెడ్డి దంపతులు పాల్గొన్నారు. ప్రిన్సిపాల్ రవీంద్ర, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. మెయిన్ క్యాంపస్లో జరిగిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ రామస్వామిరెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో ఫ్యాకల్టీ క్లబ్, స్టూడెంట్ అసోసియేషన్స్ కౌన్సిల్ సభ్యులు, సమన్వయ కర్తలు సరోజ, సంధ్యారాణి, బాలాజీ కృష్ణ పాల్గొన్నారు.