శంషాబాద్ రూరల్, సెప్టెంబర్ 30 : తెలంగాణ ఆడబిడ్డల పండుగ బతుకమ్మ వేడుకలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. శుక్రవారం శంషాబాద్ మండలం నర్కూడ గ్రామంలోని అమ్మపల్లి దేవాలయం వద్ద ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత మొదట అమ్మపల్లి దేవాలయంలోని సీతారామచంద్రస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. బతుకమ్మలను ఆలయ కోనేరులో నిమజ్జనం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ తెలంగాణ ఆడబిడ్డల పండుగా అయిన బతుకమ్మను నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గ్రామాలు పట్టణాలు తేడా లేకుండా ప్రతి ఆడబిడ్డ తీరొక్క పూలను తీసుకువచ్చి బతుకమ్మలను పేర్చి అందంగా తయారు చేసి తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ వేడుకలు జరుపుకుంటారని వివరించారు. జెన్నీఫర్ లార్డ్స్, ఎంపీపీ జయమ్మ, జడ్పీటీసీ నీరటి తన్విరాజు, వైస్ ఎంపీపీ నీలంనాయక్, పార్టీ మండలాధ్యక్షుడు చంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి మోహన్రావు, సర్పంచ్లు దండుఇస్తారి,రాంగోపాల్, సతీశ్యాదవ్, నాయకులు నీరటి రాజు ముదిరాజ్ పాల్గొన్నారు.