సైదాబాద్, సెప్టెంబర్ 30 : సైదాబాద్ మాతృశ్రీకాలనీలోని శ్రీరేణుకా ఎల్లమ్మ ఆలయంలో అమ్మవారిని మహాలక్ష్మీదేవిగా అలంకరించారు. ఐఎస్ సదన్ డివిజన్ పరిధిలోని వాణీనగర్ కాలనీలోని దుర్గామాత మండపంలో టీపీసీసీ కార్యదర్శి కోట్ల శ్రీనివాస్ దంపతులు అమ్మవారికి పూజలు చేశారు. మలక్పేట దయానంద్ నగర్ కాలనీలోని శ్రీహరిహర క్షేత్రం ఆలయంలో మహిళలు సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. మాతృశ్రీ కాలనీ రేణుకా ఎల్లమ్మ ఆలయం అభివృద్ధి కమిటీ చైర్మన్ దాసరి శ్యాం, సభ్యులు బాబురావు, మల్లేశ్, ప్రవీణ్, యశ్వంత్, దినేశ్ గౌలికర్, శంకర్, అమర్రెడ్డి, మధుకర్, జ్ఞానేశ్వర్, ఆనంద్, అమర్, శశిధర్ రెడ్డి, జీవీ రావు, మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు.
జీవన్ జ్యోతి సంఘంలో కొలువైన శ్రీజయదుర్గాదేవి ఆలయం వద్ద శుక్రవారం ఆలయ కమిటీ ప్రతినిధి హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొరుడు భూమేశ్వర్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దుర్గామాత మాలధారణ స్వాముల సౌకర్యార్థం తొమ్మిది రోజులపాటు అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగిస్తామని తెలిపారు. నల్లబోలు సర్వన్ నాయుడు, మహేశ్కుమార్, అనిల్కుమార్ సహాయసహకారాలతో అన్నదానం చేస్తున్నామని ఆయన తెలిపారు. నల్లబోలు సర్వన్ నాయుడు, మహేశ్కుమార్, కావేటి ధర్మరాజ్, అనిల్కుమార్, పొదిళ్ల శ్రీధర్, రఘు పాల్గొన్నారు.
మలక్పేట, సెప్టెంబర్ 30 : మూసారాంబాగ్ బస్తీలోని దుర్గా రాజరాజేశ్వరి (త్రిశక్తి )ఆలయంలో ఐదోరోజు గాయత్రీదేవి అవతారంలో దర్శనమిచ్చారు. ఆలయకమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యాదగిరి, రాజేశ్వర్రావు, జంగం, విష్ణుయాదవ్, జంగారెడ్డి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. దిల్సుఖ్నగర్ కాలనీలోని జై మాతా ది ఫ్రెండ్స్ అసోసియేషన్ మండపంలో అన్నపూర్ణాదేవి అలంకారం ఉన్న అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. జిల్లా లీగల్ సెల్ కన్వీనర్ ఆవుల ప్రవీణ్ యాదవ్ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అసోసియేషన్ నిర్వాహకులు, జిల్లా అధ్యక్షుడు సంరెడ్డి సురేందర్రెడ్డి, కార్పొరేటర్ భాగ్యలక్ష్మి, శివ, నర్సింగ్, విజయ్, నవీన్ పాల్గొన్నారు.