చర్లపల్లి, సెప్టెంబర్ 27 : తెలంగాణ ఉద్యమంలో తనదైన పాత్ర పోషించిన స్వాతంత్య్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు స్ఫూర్తిదాయకమని ఉప్ప ల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. ఏఎస్రావునగర్ డివిజన్ పరిధిలోని శ్రీ భావన రుషి కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ, పద్మశాలి టౌన్షిప్లో సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శంకర్ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించిన కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన కొండా లక్ష్మణ్ బాపూజీని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
రాష్ట్ర చేనేత సహకార సంఘానికి ఎంతో సేవ చేశారని గు ర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు శిరీషా సోమశేఖర్రెడ్డి, ప్రభుదాస్, పన్నాల దేవేందర్రెడ్డి, శాంతి సాయిజెన్శేఖర్, సొసైటీ చైర్మన్ సీత ఆంజనేయులు, సర్కి ల్ ఏఎంహెచ్ఓ డాక్టర్ స్వప్నారెడ్డి, మాజీ కార్పొరేటర్లు పజ్జూరి పావనీమణిపాల్రెడ్డి, సింగిరెడ్డి ధన్పాల్రెడ్డి, సొసై టీ ఉపాధ్యక్షుడు అతినగరం సుదేశ్, కార్యదర్శి పున్న రమే శ్, కోశాధికారి రామకృష్ణ, సభ్యులు విడియం సుదర్శన్, కర్నాటి నాగభూషణం, గుర్రం విశ్వేశ్వర్రావు, మల్లేశ్వరి, శివలీల, సీసీఎస్ ప్రతినిధి ఎంపెల్లి పద్మారెడ్డి, నాయకులు కుమారస్వామి, బేతాల బాల్రాజు, శేర్ మణెమ్మ, ఏనుగు సీతారామిరెడ్డి, నాగేశ్వర్రెడ్డి, సుదర్శన్రెడ్డి, సురేందర్చారి, సింగం రాజు, బాల్నర్సింహ, యాకయ్య, జనార్దన్రెడ్డి, కృష్ణయాదవ్, ఉపేందర్, అనిల్, వినోద్, రాజేశ్, రామతులసీతో పాటు కాలనీవాసులు పాల్గొన్నారు.
డ్రైనేజీ సమస్య పరిష్కారానికి కృషి
చర్లపల్లి డివిజన్ పరిధిలోని సాయినగర్లో నెలకొన్న డ్రైనేజీ సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. చర్లపల్లి డివిజన్ సాయినగర్ సంక్షేమ సంఘం నాయకులు ఎమ్మెల్యేను కలిసి డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సాయినగర్లో ప్రధాన సమస్యగా మారిన డ్రైనేజీ సమస్యను త్వరలో పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. అదేవిధంగా కాలనీలో పారిశుధ్య పనులు వేగవంతం చేసేందుకు సం బంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో కాలనీ నాయకులు వినోద్, అనిల్, రాజేశ్, సీసీఎస్ ప్రతినిధి ఎంపెల్లి పద్మారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.