అబిడ్స్,సెప్టెంబర్27: తెలంగాణ రాష్ట్ర అడ్వకేట్స్ ఫోరం ఏర్పాటై పదిహేనేండ్లు పూర్తయిందని, ఈ సందర్భంగా జిల్లా కమిటీలతో పాటు రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేసినట్లు ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు వహీద్ అహ్మద్, ప్రధాన కార్యదర్శి వాజిద్ అలీ ఖాన్, అదనపు ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఉస్మాన్ పేర్కొన్నారు. మంగళవారం టోలిచౌకిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ 15 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అక్టోబర్లో వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నూతన కమిటీని ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు వహీద్ అహ్మద్ ప్రకటించారు. ఫోరం ఉపాధ్యక్షులుగా ఎంఎ.రవూఫ్ సిద్ధ్దిఖీ, మహ్మద్ అయాజుద్దీన్ చందా, అర్షద్ అహ్మద్ ఖాన్, మహ్మద్ అతర్ హుస్సేన్, ప్రధాన కార్యదర్శి మీర్ వాజిద్ అలీ ఖాన్, అదనపు ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఉస్మాన్, ఆన్గనైజింగ్ సెక్రటరీ/కోశాధికారిగా మహ్మద్ సాజిద్ అలీ, కార్యదర్శిగా అరిఫ్ రవూఫ్, షేక్ ముర్తూజా, ఫరా తబుస్సుం, పీర్ మహ్మద్, గౌస్ పాష, సయ్యదా జకియా ఫాతిమా, సయ్యద్ ఫరీదుద్దీన్, జాయింట్ సెక్రటరీగా జోరా ఫాతిమా, సయ్యద్ అర్జిమంద్ ఫాతిమా, ఖైసర్ పాష, ఫైజల్ జబ్రీని నియమించినట్లు తెలిపారు.