హిమాయత్నగర్, సెప్టెంబర్26: ‘నమస్తే తెలంగాణ- తెలంగాణ టుడే’ సంయుక్తాధ్వర్యంలో నిర్వహిస్తున్న దసరా బొనాంజా ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు సోమవారం హిమాయత్నగర్లోని నిలోఫర్ కేఫ్లో లక్కీ డ్రా తీశారు. పలువురు వినియోగదారుల సమక్షంలో నిలోఫర్ కేఫ్ చైర్మన్ బాబురావు, ‘నమస్తే తెలంగాణ’ సర్క్యూలేషన్ డీజీఎం రామిరెడ్డి చేతుల మీదుగా లక్కీ డ్రా తీసి..ఐదుగురు విజేతలను ఎంపిక చేశారు. మొదటి బహుమతి భూత్నాథ్, రెండో బహుమతి స్వాతి, మూడో బహుమతి విరాట్దత్తా, నాలుగు, ఐదో బహుమతులు నిలోఫర్ కేఫ్ కస్టమర్లు రాహుల్, అజార్ గెలుచుకున్నారు. ఈ కార్యక్రమంలో అడ్వర్టయిజింగ్ ఏజీఎం రాజిరెడ్డి, డిప్యూటీ మేనేజర్ శ్రీకాంత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మంచి స్పందన
ప్రతి ఏడాది నగరంలో ఎంపిక చేసిన ఔట్లెట్లలో కొనుగోలుదారుల కోసం ‘నమస్తే తెలంగాణ- తెలంగాణ టుడే’ల ఆధ్వర్యంలో దసరా బొనాంజా ఉత్సవాలు నిర్వహిస్తున్నాం.ఈ నెల 30వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ‘నమస్తే తెలంగాణ- తెలంగాణ టుడే’ దినపత్రికలను పాఠకులు మరింత ఆదరించాలి. ఈ లక్కీ డ్రాకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తున్నది.
– రామిరెడ్డి ,సర్యూలేషన్ డీజీఎం, నమస్తే తెలంగాణ
ఆనందంగా ఉంది..
‘నమస్తే తెలంగాణ-తెలంగాణటుడే’ నిర్వహించే దసరా బొనాంజా ఉత్సవాల్లో తాము భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉంది. 46 ఏండ్లుగా నిలోఫర్ కేఫ్ నగర వాసులకు విభిన్న రుచులతో చాయ్తో పాటు రుచికరమైన ఆహారం అందిస్తున్నది. మా వద్దకు వచ్చే కస్టమర్లకు సైతం బహుమతులు రావడం సంతోషకరం.
– బాబురావు, చైర్మన్, నిలోఫర్ కేఫ్
నిలోఫర్తో ఎంతో అనుబంధం..
రోజంతా పనిచేసి అలిపోయినప్పుడు కొత్త ఉత్సాహం రావాలంటే ఓ చాయ్ తాగాల్సిందే. రుచికరమైన చాయ్ను అందించడంలో నిలోఫర్ కేఫ్ ప్రత్యేకత చాటుకుంటున్నది. నిత్యం ఇక్కడ వచ్చి టీ తాగాకే మిగితా పనులు చేసుకుంటాను. ఇక్కడే దొరికే చాయ్ రుచి మరెక్కడా దొరకదు.స్నేహితులందరం కలిసి వచ్చి రెగ్యులర్గా టీ తాగుతుంటాం.
–అరుణ్ కుమార్రెడ్డి, రెడ్డి హాస్టల్ విద్యార్థి
మొదటి బహుమతి గెల్చుకోవడం..
నేను రసూల్పురాలో కిరణా షాపు నిర్వహిస్తున్నా. ఇటీవల ఫ్రీడం ఆయిల్ కొనుగోలు చేశా. లక్కీడ్రాలో మొదటి బహుమతి గెల్చుకున్నట్లు ఫోన్ చేసి చెప్పారు. ‘నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో నిర్వహించిన దసరా బోనాంజాలో మొదటి బహుమతిని గెల్చుకోవడం ఆనందంగా ఉంది.
– భూత్నాథ్, రసూల్పురా