సిటీబ్యూరో, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో సోమవారం సాయంత్రం గ్రేటర్ వ్యాప్తంగా వాన దంచికొట్టింది. లోతట్టు ప్రాంతాల్లో వరదనీరు చేరడంతో చెరువులను తలపించాయి. వెంటనే స్పందించిన డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి వరద నీరు సాఫీగా వెళ్లే విధంగా చర్యలు చేదంచికొట్టిన వానపట్టాయి. రాత్రి 9 గంటల వరకు నగరంలోని నాంపల్లిలో అత్యధికంగా 9.దంచికొట్టిన వాన5 సెం.మీలు, గన్ఫౌండ్రీదంచికొట్టిన వానబంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో సోమవారం సాయంత్రం గ్రేటర్ వ్యాప్తంగా వాన దంచికొట్టింది.లో 8.6 సెం.మీ, మెహిదీపట్నంలో 8.3సెం.మీ, ఖైరతాబాద్లో 7.5సెం.మీ, సరూర్ నగర్లో 7.2సెం.మీ, రాజేంద్రనగర్లో 6.4సెం.మీ, హిమాయత్ నగర్లో 6.3సెం.మీ, ఆసిఫ్నగర్లో 6.2 సెం.మీ, బండ్లగూడ కందికల్గేట్లో అత్యల్పంగా 1.0 సెం.మీల మేర వర్షపాతం నమోదైంది. పలుచోట్ల వర్షం వల్ల ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడగా.. ట్రాఫిక్ సిబ్బంది వెంటనే సహాయక చర్యలు చేపట్టి క్రమబద్ధీకరించారు. మరో మూడు రోజులు పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు, మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.