మణికొండ, ఆగస్టు 24: రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి మండల నాయకులు హాజరుకావాలని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ కోరారు. బుధవారం రాజేంద్రనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గండిపేట్ మండలం, మణికొండ, బండ్లగూడ, నార్సింగి మున్సిపాలిటీల చైర్మన్లు, కొన్సిలర్లు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గురువారం సీఎం కేసీఆర్ రంగారెడ్డి జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయ ప్రారంభోత్సవం అనంతరం బహిరంగ సభ నిర్వహిస్తున్న సందర్భంగా మండల స్థాయి నాయకులు రావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బండ్లగూడ మేయర్ మహేందర్గౌడ్, చైర్ పర్సన్ రేఖ, వైస్ చైర్మన్ వెంకటేశ్ యాదవ్, మణికొండ మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ కె.రామకృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ తలారి మల్లేశ్, గండిపేట అధ్యక్షుడు నర్సింహ, బండ్లగూడ అధ్యక్షుడు సురేశ్గౌడ్, పీరంచెరువు మాజీ సర్పంచ్ రావు కోల్లు నాగరాజు, మున్సిపాలిటీ కొన్సిలర్లు సాగర్గౌడ్, పాపయ్యయాదవ్, నాయకులు జైరాజ్, రూపారెడ్డి, ధన్రాజ్, ఏర్పుల కుమార్, అందె లక్ష్మణ్, శ్రావణ్, దిలీప్, తదితరులు పాల్గొన్నారు.
శంషాబాద్ రూరల్, ఆగస్టు 24: నేడు రంగారెడ్డి జిల్లా కార్యాలయం ప్రారంభోత్సవంతో పాటు అక్కడే నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పార్టీ మండలాధ్యక్షుడు చంద్రారెడ్డి ప్రజలను కోరారు. బుధవారం శంషాబాద్ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నూతనంగా నిర్మించిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంతో పాటు అక్కడే నిర్వహిస్తున్న సభకు ప్రజలు, పార్టీ నాయకులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.
సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు దిద్యాల శ్రీనివాస్, సర్పంచ్ దండుఇస్తారి, మాజీ ఎంపీటీసీ మోహన్నాయక్, మండలపార్టీ ప్రధాన కార్యదర్శి మోహన్రావు, శ్రీధర్గౌడ్, మాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.