బడంగ్పేట, ఆగస్టు 18 : కోట్లాది రూపాయల వ్య యంతో మహేశ్వరం మండలాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి నిరంతరం కృషి చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో నర్సింహులు అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. వ్యవసాయశాఖ, ఉద్యానశాఖ, పశుసంవర్థక శాఖ, పంచాయతి, గ్రా మీణాభివృద్ధి, విద్యుత్శాఖ, ఎక్సైజ్ శాఖ, మహిళా శిశు సంక్షేమశాఖ, విద్యాశాఖ, మిషన్భగీరథ, ఆర్టీసీ శాఖ, రోడ్ల అభివృద్ధిశాఖ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో చేపట్టిన, చేపట్టబోయే అభివృద్ధి పనులపై చర్చించారు. బాలావికాస్ సంస్థ నుంచి రూ. 50 లక్షల వ్యయంతో కొనుగోలు చేసిన కంప్యూటర్ల ద్వారా పాఠశాలలో విద్యార్థులకు కంప్యూటర్ శిక్షణ ఇస్తున్నామని అధికారులు తెలిపారు. మన్సాన్పల్లి చౌరస్తా నుంచి ఇతర గ్రామాలకు వెళ్లే రహదారులు అధ్వానంగా ఉన్నాయని, వాహనదారులు కిందపడి గాయాలపాలవుతున్నారని, రోడ్ల అభివృద్ధి పనులు చేపట్టాలని, కొన్ని గ్రామాలలో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని పలువురు ఎంపీటీసీలు, సర్పంచ్లు సమస్యలను లేవనెత్తారు. మహేశ్వరం నుంచి షాద్నగర్, ఇబ్రహీంపట్నానికి విద్యార్థుల సౌకార్యార్థం బస్సులు ఏర్పాటు చేయాలని సమావేశంలో పలువురు కోరారు.
ఏ వేళలో బస్సులు కావాలో మేనేజర్కు వినతిపత్రం ఇస్తే వారు పరిశీలించి బస్సులను ఏర్పాటు చేస్తారని మంత్రి అన్నారు. మహేశ్వరం మండలంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ దవాఖానలో మార్చురీ ఏర్పాటు చేయాలని కోరగా త్వర లో ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. జరగుతున్న, జరగబోయే అభివృద్ధి పనులపై సమావేశంలో అధికారులు ప్రవేశపెట్టిన తీర్మానాలపై ప్రజా ప్రతినిధులు ఆమోదించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రూ. 1,77 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు నిధులు కేటాయించినట్లు తెలిపారు. రూ. 90 లక్షల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, మిగతా అభివృద్ధి పనులు త్వరలో ప్రారంభమవుతాయని అన్నారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, ఎమ్మార్వో జ్యోతి, ఎంఈఓ క్రిష్ణ, ఎంపీపీ రఘుమారెడ్డి, వైస్ ఎంపీపీ అంధ్యానాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్ పాండు యాదవ్, డీఈ శ్రీనివాస్రెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచ్లు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
దేవాలయాల నిర్మాణానికి కృషి
కందుకూరు : దేవాలయాల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి తెలిపారు. అందుకు కావాల్సిన స్థలాలను కేటాయిస్తున్నట్లు చెప్పారు. జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, కొత్తగూడ సర్పంచ్ సాధ మల్లారెడ్డి, మాజీ సర్పంచ్ బొక్క మాధవరెడ్డిలు గురువారం మంత్రిని కలిసి నూతన దేవాలయం నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని కోరడంతో మంత్రి అంగీకరించారు. అదే విధంగా గ్రామాభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు సౌడపు శేఖర్గౌడ్, బొక్క సత్యనారాయణరెడ్డి, ప్రభాకర్రెడ్డి, బొక్క లోకేశ్వర్రెడ్డి, ప్రతాపరెడ్డి, దామోదర్రెడ్డి, సంజీవరెడ్డి,టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియ కన్వీనరు బొక్క దీక్షిత్రెడ్డి, సౌడపు శంకర్గౌడ్, వెంకటేశ్గౌడ్, క్రిష్ణగౌడ్, సుధాకర్రెడ్డి పాల్గొన్నారు.