మణికొండ, ఆగస్టు 18 : మహనీయుల త్యాగాలను తెలిపేందుకే ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ తెలిపారు. వజ్రోత్సవాల్లో భాగంగా గురువారం మణికొండ మున్సిపాలిటీలో ఫ్రీడం కప్ పేరిట నిర్వహించిన వివిధ క్రీడల్లో ప్రజాప్రతినిధులు, సిబ్బంది, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ హాజరై క్రీడాపోటీలను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అన్నివర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు. దేశానికి స్వతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 22 వరకు రోజుకో కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. ఫ్రీడం కప్ పేరిట మున్సిపల్ అధికారులు నిర్వహిస్తున్న క్రీడాపోటీలు అభినందనీయమన్నారు. కార్యక్రమంలో మణికొండ మున్సిపల్ చైర్మన్ కస్తూరి నరేందర్, వైస్ చైర్మన్ నరేందర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఫల్గుణ్కుమార్, మున్సిపల్ టీఆర్ఎస్ ఫ్లోర్లీడర్ రామకృష్ణారెడ్డి,కౌన్సిలర్లు శ్వేతరవికాంత్రెడ్డి, హైమాంజలి, మీనా,వందన,శైలజ,మహిళా నాయకులు లక్ష్మీశ్రీ, రూపారెడ్డి, శివగంగ పాల్గొన్నారు.
బండ్లగూడలో…
బండ్లగూడ: ఫ్రీడం క్రికెట్ టోర్నమెంట్ పోటీలను ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, మేయర్ మహేందర్ గౌడ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మహేందర్ గౌడ్ టీం, కమిషనర్ వేణుగోపాల్రెడ్డి టీంలు పోటీ పడ్డాయి. ఈ పోటీల్లో మహేందర్ గౌడ్ టీం విజయం సాధించగా కప్ను బహూకరించారు.
కల్యాణ లక్ష్మి చెక్కులు అందజేత
సీఎం కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలు పేదలకు వరంగా మారాయని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అన్నారు. గురువారం రాజేంద్రనగర్ మండల కార్యాలయంలో 547 మంది లబ్ధిదారులకు షాదీముబారక్, కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడాలేని విధంగా షాదీముబారక్, కల్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశ పెట్టారన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు అర్చన జయప్రకాశ్, సంగీత గౌరీశంకర్, తహసీల్దార్ చంద్రశేఖర్, ధర్మారెడ్డి, మహేశ్, శ్రావణ్ పాల్గొన్నారు.