మియాపూర్, ఆగస్టు18: పేదింటి ఆడబిడ్డల పెండ్లి కి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం కొండంత ఆసరాగా నిలుస్తున్నదని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా 111 మందికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం కింద మంజూరైన రూ.1,11,12,876 ఆర్థిక సాయం నిధులను కార్పొరేటర్ మంజుల రఘునాథ్రెడ్డి, తహసీల్దార్ వంశీ మోహన్తో కలిసి మియాపూర్ క్యాంపు కార్యాలయంలో గురువారం లబ్ధిదారులకు పంపిణీ చేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ తరహా పథకాన్ని దేశంలో ప్రవేశపెట్టిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరేనని, కేంద్రం నుంచి ఏ రకమైన తోడ్పాటు లేకున్నా ఆర్థిక వనరులను సమకూర్చుకుంటూ ప్రజా సంక్షేమ పథకాలకు ఏమాత్రం లోటు లేకుండా ముందు కు నడిపిస్తున్నారని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలను అర్హులైన ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని గాంధీ కోరారు. ఈ పథకాలతో తల్లిదండ్రులకిక తమ కూతుళ్ల పెండ్లి ఏమా త్రం భారం కాదన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ గౌలిదొడ్డికి చెందిన పరమేశ్, శేరిలింగంపల్లి ఆదర్శ్నగర్కు చెందిన సత్యనారాయణ, చందానగర్ శ్రీకాంత్, మాదాపూర్ నాగరాజులకు దళిత బంధు పథకాల ద్వారా మంజూరైన కార్లను తన నివాసంతో పాటు మియాపూర్ క్యాంపు కార్యాలయంలో కార్పొరేటర్ మంజుల రఘునాథ్రెడ్డి, మాజీ కార్పొరేటర్ సాయిబాబాలతో కలిసి విప్ గాంధీ లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంచుకున్న యూనిట్లను విజయవంతంగా నిర్వహించుకుని తోటి వారికి ఆదర్శంగా నిలవాలన్నారు. సామాజిక ఆర్థిక సమానత్వంను దళితులకు అందించేందుకు సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నారన్నారు. ఈ పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు రాజు, సత్యనారాయణ, జంగయ్య, కాశీనాథ్, ఇతర పార్టీ నేతలు పాల్గొన్నారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని పలు డివిజన్లకు చెందిన లబ్ధిదారులకు అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం సీఎం సహాయ నిధి పథకం కింద మంజూరైన రూ.1.36 లక్షల ఆర్థిక సాయం (ఎల్వోసీ) చెక్కును విప్ గాంధీ తన నివాసంలో అందించారు. పేదలకు సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసాను అందిస్తున్నదన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు పాల్గొన్నారు.