కేపీహెచ్బీ కాలనీ, ఆగస్టు 18: దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన త్యాగధనుల సేవలను స్మరించుకోవాలని భావితరాలకు పోరాట యోధుల సేవలను వివరించాలని కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత అన్నారు. గురువారం వజ్రోత్సవాల్లో భాగంగా ఆంజనేయనగర్ షెటిల్ కోర్టులో జీహెచ్ఎంసీ ఉద్యోగులకు నిర్వహించిన ఫ్రీడమ్ కప్ షెటిల్ పోటీలను జడ్సీ మమత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బ్రిటిష్ పాలకులనుంచి దేశానికి స్వాతంత్య్రాన్ని తీసుకొచ్చేందుకు ఎందరో మహనీయులు ప్రాణాలర్పించారన్నారు. 75 ఏండ్ల స్వాతంత్య్ర వేడుకలు ప్రజలందరిలో సమైక్య స్ఫూర్తిని నింపేలా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. వజ్రోత్సవాల్లో భాగంగా నిర్వహించిన షెటిల్ పోటీలలో పాల్గొన్న ఉద్యోగులు, క్రీడాకారులను అభినందించారు. నిత్య జీవితంలో క్రీడలు, వ్యాయామానికి ప్రాధాన్యతనివ్వాలని.. ప్రజలంతా ఆరోగ్యవంతంగా జీవించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఈ చిన్నారెడ్డి, డీసీలు రవికుమార్, ప్రశాంతి, ఈఈలు గోవర్దన్ గౌడ్, సత్యనారాయణ, డీఈలు, ఏఈలు, జీహెచ్ఎంసీ సిబ్బంది పాల్గొన్నారు.
అగ్నిమాపక విభాగం ఆధ్వర్యంలో ర్యాలీ..
స్వాతంత్య్ర వజ్యోత్సవాల సందర్భంగా కూకట్పల్లి అగ్నిమాపక విభాగం ఆధ్వర్యంలో జాతీయ సద్భావన ర్యాలీని నిర్వహించారు. గురువారం కేపీహెచ్బీ కాలనీలో ఈ ర్యాలీని కార్పొరేటర్ మందడి శ్రీనివాస్రావు, డైరెక్టర్ ఆఫ్ ఫైర్ సర్వీసెస్ సి.లక్ష్మీనారాయణ, అసిస్టెంట్ డైరెక్టర్ సి.వి.నారాయణరావు, కూకట్పల్లి డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ బి.సుధాకర్రావు, అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ వై.సైదులు, కె.వి.సతీశ్కుమార్, స్టేషన్ ఫైర్ ఆఫీసర్లు వి.సుభాష్ రెడ్డి, ఎన్.శివప్రసాద్లు ప్రారంభించారు. ఈ ర్యాలీలో 4 కి.మీ జాతీయ పతాకాన్ని ఫైర్ సిబ్బంది, విద్యార్థులు కలిసి ర్యాలీగా కూకట్పల్లి వై జంక్షన్ వరకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. దేశ విముక్తి కోసం ప్రాణాలర్పించిన మహనీయులకు నివాళులర్పించాలని, వజ్రోత్సవాలను ఘనంగా జరుపుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఫైర్ సిబ్బంది నవీన్ రెడ్డి, రాజేశ్వర్, నవాజ్ రెడ్డి, జయప్రకాశ్, శేఖర్, నాగరాజు, ప్రవీన్కుమార్, చంద్రశేఖర్, సాయిబాబా, రవికుమార్ పాల్గొన్నారు.