గోల్నాక, ఆగస్టు 18: పేద కుటుంబాల్లో ఆడబిడ్డల పెండ్లిండ్లకు సీఎం కేసీఆర్ పెద్దన్నలా ఆర్థిక సాయం చేస్తున్నారని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ సీఎం పేద ప్రజల గుండెల్లో నిలిచిపోయారని ఆయన తెలిపారు. గురువారం అంబర్పేట మండల కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కల్యాణలక్ష్మి కింద 18 చెక్కులు, షాదీముబారక్ పథకం కింద 72 మంది లబ్ధిదదారులకు రూ.90లక్షల10వేల 440 విలువగల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పేద ప్రజల కష్టాలు తెలిసిన నాయకుడన్నారు. ఈ పథకంతో ఎన్నో నిరుపేద కుటుంబాలు లబ్ధిపొందుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారులు బీవీ.మహేశ్, రాజు, రాము తదితరులు పాల్గొన్నారు.