కవాడిగూడ, ఆగస్టు 18: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చరిత్రను తెలియజేసేందుకే ప్రభుత్వం జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నదని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. గురువారం కవాడిగూడ గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా పాపన్న గౌడ్ చిత్ర పటానికి రాజ్యసభ్య సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్, కవాడిగూడ డివిజన్ కార్పొరేటర్ గోడ్చల రచనశ్రీ, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎమ్మెన్ శ్రీనివాస్ రావు, తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దూడల శంకర్ గౌడ్, కవాడిగూడ గౌడ సంఘం చైర్మన్ రంగరాజ్ గౌడ్, గౌడ సంఘం అధ్యక్షుడు సానెం హరీశ్ గౌడ్ హాజరై పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ సర్దార్ పాపన్న గౌడ్ దొరలను, భూస్వాములను, రాజులను వ్యతిరేకించి సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని కులమతాలకతీతంగా అందరిని చేరదీశారని అన్నారు. భూస్వాముల వద్ద ఉన్న సంపదను పేదలకు పంచి ప్రజలందరితో సర్దార్ అనిపించుకున్నాడని కొనియాడారు. రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ బహుజనుల రాజ్యాధికారం కోసం సర్వాయి పాపన్న గౌడ్ ఎంతో కృషి చేశారన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ ఇందిరాశోభన్, కవాడిగూడ గౌడ సంఘం డైరెక్టర్లు లింగాల ప్రకాశ్ గౌడ్, దూడల రవిగౌడ్, మద్దెల చంద్రయ్య గౌడ్, నాయకులు అంజయ్య గౌడ్, చంద్రమౌళి, అంబాల మల్లేశ్ గౌడ్, బీజేపీ నాయకులు రమేశ్రామ్, శ్రీనివాస్ యాదవ్, వెంకటేశ్, ఎంసీ మహేందర్ బాబు, ప్రభాకర్ గంగపుత్ర, కేశవరాజు, ప్రతాప్ గౌడ్, సత్యనారాయణ గౌడ్, రమేశ్ గౌడ్, అరుణ్ గౌడ్, భిక్షపతి గౌడ్, ప్రవీణ్ గౌడ్, సతీశ్గౌడ్ పాల్గొన్నారు.
బాగ్లింగంపల్లిలో..
బీసీ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో గురువారం బాగ్లింగంపల్లిలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ దాసు సురేశ్, అధ్యక్షుడు వీజీఆర్ నారగోనే, సూర్యారావు పాల్గొని పాపన్నగౌడ్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ సర్వాయి పాపన్న గౌడ్ను ఆదర్శంగా తీసుకొని రాజ్యాధికారం కోసం ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.కార్యక్రమంలో హరిత్ రుడి, దొంతు ఆనంద్, జగదీశ్ యాదవ్, జయ, ప్రకాశ్భరత్, దీపిక బిల్లా పాల్గొన్నారు.