ఎల్బీనగర్ జోన్బృందం, ఆగస్టు 14: స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఎల్బీనగర్ నియోజకవర్గం వ్యాప్తంగా ఆదివారం ఫ్రీడమ్ రన్లు, తిరంగా ర్యాలీలు నిర్వహించారు. సరూర్నగర్ పోస్టాఫీస్ నుంచి లింగోజిగూడ మాజీ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాస్రావు ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో పాటు కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులతో కలిసి ఫ్రీడమ్ ర్యాలీని నిర్వహించి, బాణాసంచా కాల్సి మిఠాయీలు పంపిణీ చేశారు. లింగోజిగూడ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు పర్నె వరప్రసాద్రెడ్డి, సీనియర్ నాయకులు నర్రె శ్రీనివాస్ కురుమ, కందికంటి శ్రీధర్ గౌడ్, భాస్కర్ గంగపుత్ర, నర్సింహ, శ్రావణ్కుమార్ గుప్తా, పలువురు డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.