అంబర్పేట/కాచిగూడ, ఆగస్టు 14: నియోజకవర్గంలో ఆదివారం స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని జోరుగా ఫ్రీడమ్ ర్యాలీలు నిర్వహించారు. డివిజన్లోని ప్రేంనగర్లో హైమావతి స్కూల్ ఆధ్వర్యంలో విద్యార్థులు 75 అడుగుల పొడవైన జెండా ను పట్టుకొని ర్యాలీ చేపట్టారు. ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, కార్పొరేటర్ ఇ.విజయ్కుమార్గౌడ్లు ముఖ్య అతిథిగా హాజరై ర్యాలీలో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వతంత్ర భారత వజ్రోత్సవాలను తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నదని చెప్పారు. అన్ని వర్గాలు ఇందులో పాల్గొని దేశభక్తిని చాటుకుంటున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ నిరంజన్, టీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు సిద్ధార్థ్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. గోల్నాక డివిజన్ నెహ్రూనగర్లో వజ్రోత్సవాల ను పురస్కరించుకొని జానపద కళా ప్రదర్శన జరిగింది. ఇందులో జీహెచ్ఎంసీ అంబర్పేట సర్కిల్ డీసీ వేణుగోపాల్తో కలిసి కార్పొరేటర్ దూసరి లావణ్యశ్రీనివాస్గౌడ్, డీపీవో రజిత, డీఈ సుధాకర్, ఏఎంఓహెచ్ జ్యోతిభాయి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రతి పౌరుడు దేశ భక్తిని చాటిచెప్పాలి
స్వతంత్ర వజ్రోత్సవాల్లో ప్రతి పౌరుడు పాల్గొని దేశ భక్తిని చాటిచెప్పాలని గోల్నాక, కాచిగూడ కార్పొరేటర్లు దూసరి లావణ్య శ్రీనివాస్గౌడ్, ఉమా రమేశ్యాదవ్ అన్నారు. వజ్రోత్సవాల్లో భాగంగా ఆదివారం జాతీయ జెండాలతో ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో దూసరి శ్రీనివాస్గౌడ్, జీహెచ్ఎంసీ డీఎంసీ వేణుగోపాల్, ఏఎంఓహెచ్, కాచిగూడ టీఆర్ఎస్ అధ్యక్షుడు భీష్మా, ఓం ప్రకాశ్యాదవ్, సునీల్బిడ్లాన్, దాత్రిక్ నాగేందర్ బాబ్జి, సదానంద్, బి.కృష్ణాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
దేశ సేవలో యువత ముందుండాలి
దేశ సేవలో యువత ముందుండాలని దూరదర్శన్ డిప్యూటీ డైరెక్టర్ ఎన్వీ రమణ అన్నారు. వందేమాతరం యూత్ఫ్రంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన భారతీయం కార్యక్రమాన్ని ఆదివారం కాచిగూడ బద్రుక కళాశాలలో ఘనంగా నిర్వహించారు. స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా విద్యార్థులు కాచిగూడలోని పలు ప్రాంతాల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. పోటీలలో పాల్గొన్ని బహుమతులను గెలిపొందారు. ఈ కార్యక్రమంలో ఓయూ ప్రొ.లక్ష్మీనారాయణ, వీఎంవైఎఫ్ కార్యదర్శి జగదీశ్వర్రావు, రాజశేఖర్ , విద్యార్థులు పాల్గొన్నారు.