మహేశ్వరం, ఆగస్టు 10 : ప్రతి ఒక్కరూ జాతీయ భావాన్ని పెంపొందించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం మహేశ్వరం మండల కేంద్రంలో గడీకోట ప్రాంగణంలోని వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఫ్రీడం పార్కును ప్రారంభించి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్వతంత్ర భారత పోరాటంలో అమరుల త్యాగాలను గుర్తించడానికే సీఎం కేసీఆర్ వజ్రోత్సవ కార్యక్రమాలు చేపట్టారని అన్నారు.
ప్రతి ఒక్కరు ఇంటి ఎదుట జాతీయ జెండాలను ఎగురవేసి స్ఫూర్తిని చాటాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రఘుమారెడ్డి, వైస్ ఎంపీపీ సునీతా ఆంధ్యానాయక్, సహకార బ్యాంక్ చైర్మన్ మంచె పాండు యాదవ్, వైస్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు అంగోతు రాజునాయక్, మహేశ్వరం మార్కెట్ కమిటీ చైర్మన్ సురసాని సురేందర్రెడ్డి, వైస్ చైర్మన్ ఆనందం, శివగంగ దేవాలయ చైర్మన్ నిమ్మగూడెం సుధీర్గౌడ్, సర్పంచ్లు కరోళ్ల ప్రియాంక రాజేశ్, మెగావత్ రాజునాయక్, స్లీవారెడ్డి, సాలీవీరానాయక్, కంది అరుణ రమేశ్, మంత్రి సంధ్యరాజేశ్, బండారు లావణ్య లింగం, నాయకులు ఎం. ఏ. సమీర్, మీనాజ్ పటేల్, ఎస్ కే ఆజాం, మిద్దింటి బాల్రాజ్, గ్రామ శాఖ అధ్యక్షుడు దుడ్డు క్రిష్ణ, ముడావత్ గోపాల్ నాయక్ డైరెక్టర్ రవీందర్నాయక్ తదితరులు పాల్గొన్నారు.