ముషీరాబాద్, ఆగస్టు 9: నియోజకవర్గంలో స్వతం త్ర వజ్రోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు జీహెచ్ఎంసీ అధ్వర్యంలో జాతీయ పతాకాల పంపిణీ కార్యక్రమంతో వజ్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. భారత స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా రాంనగర్ చౌరస్తాలో ఏర్పాటు చేసి కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్ పాల్గొని జాతీయ జెండాల పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎందరో మహనీయుల పోరాటాలు, ప్రాణత్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్య్రం లభించిందన్నారు. మహాత్ముని నిస్వార్థంగా పోరాటం దేశానికి స్వాతంత్య్రాన్ని తెచ్చిపెట్టిందన్నారు. మహనీయులు కన్న కలలను సాకారం చేయడానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు.
స్వతంత్ర వజ్రోత్సవాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములై దేశ సమైక్యతను చాటుతూ మహనీయుల స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్లాలని కోరారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా స్వతంత్ర వజ్రోత్సవాలను తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపడుతుందన్నారు. పక్షం రోజుల పాటు నిర్వహించే వజ్రోత్సవాల్లో రాజకీయాలకు అతీతంగా అందరు పాల్గొం టూ తమతమ ఇళ్లపై విధిగా జాతీయ జెండాలను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. నేటి నుంచి జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది, టీఆర్ఎస్ కార్యకర్తలు బస్తీలు, కాలనీల్లో ఇంటింటికి జెండాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఇన్చార్జి డిప్యూటీ కమిషనర్ మురళీ, ఎఎంహెచ్ఓ మైత్రేయి, టీఆర్ఎస్ యూత్ విభాగం నేత ముఠా జయసింహ, మాజీ కార్పొరేటర్ ముఠా పద్మ, రాంనగర్, ముషీరాబాద్, అడిక్మెట్, గాంధీనగర్, కవాడిగూడ డివిజన్ల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రావులపాటి మోజస్, నర్సింగ్ప్రసాద్, బి.శ్రీనివాస్రెడ్డి, రాకేష్కుమార్, వై.శ్రీనివాస్, నాయకులు మల్లిఖార్జున్రెడ్డి, నేత శ్రీనివాస్, టీ.సోమసుందర్, లక్ష్మణ్ గౌడ్, శ్రీధర్రెడ్డి, ముచ్చకుర్తి ప్రభాకర్, ముఠా నరేష్, సురేందర్, సయ్యద్ అస్లాం, మహ్మద్ ఖదీర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రతి ఇంటికి జాతీయ పతాకాలు పంపిణీ
చిక్కడపల్లి, ఆగస్టు 9: స్వతంత్ర భారత వజ్రోత్సవాలను నియోజకవర్గం పరిధిలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే ముఠా గోపాల్కు అన్నారు. మంగళవారం చిక్కడపల్లిలోని బ్రహ్మకుమారీస్ సంస్థలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠాగోపాల్ జాతీయ జెండాలను బ్రహ్మకుమారీస్ చిక్కడపల్లి ముఖ్యలు జయశ్రీకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంటికి జాతీయ పతాకాలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ గాంధీనగర్ డివిజన్ అధ్యక్షుడు ఎం.రాకేశ్కుమార్, నాయకులు ముచ్చకుర్తి ప్రభాకర్, మారిశెట్టి నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు.
కవాడిగూడ, భోలక్పూర్లో..
కవాడిగూడ, ఆగస్టు 9: ఆజాదీకా అమృత్ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మంగళవారం కవాడిగూడ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ గోడ్చల రచనశ్రీ, జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ ఏసీపీ పావనిలు జాతీయ జెండాలను పంపిణీ చేశారు. అదే విధంగా భోలక్పూర్ డివిజన్లోని బీజేపీ అధ్యక్షుడు రేగుల రవికుమార్ ఆధ్వర్యంలో జాతీయ జెండాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ సిబ్బంది లింగం, ఇస్మాయిల్, నాయకులు మహేందర్ బాబు, వెంకటేశ్, ప్రభాకర్, దిలీప్ యాదవ్, హరీశ్ తదితరులు పాల్గొన్నారు.