సిటీబ్యూరో, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ) : సాంకేతిక పరిజ్ఞానం వంటివి ఏవైనా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే పురుడుపోసుకోవడం ఆనవాయితీ. అభయ ఉదంతం సమయంలో షీ టీమ్స్, కమాండ్ కంట్రోల్ సెంటర్.. ఇలా ప్రతీది సైబరాబాద్ నుంచే ప్రారంభమయ్యాయి. తాజాగా ట్రాఫిక్ టాస్క్ఫోర్స్ను ఆదివారం కమిషనరేట్ పరిధిలో జాయింట్ సీపీ అవినాష్ మహంతి, క్రైం డీసీపీ కల్మేశ్వర్, ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్రావులతో కలిసి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర జెండా ఊపి ట్రాఫిక్ టాస్క్ఫోర్స్ వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకుని, విజుబుల్ పోలీసింగ్లో భాగంగా ట్రాఫిక్ టాస్క్ఫోర్స్ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్రావు ఆధ్వర్యంలో ఈ ట్రాఫిక్ టాస్క్ఫోర్స్ పనిచేస్తుందన్నారు. ఇందుకోసం ఆరు ద్విచక్ర వాహనాలను ప్రత్యేకంగా తయారు చేయించామని, ఒక్కో వాహనంపై ఇద్దరు కానిస్టేబుళ్లు ట్రాఫిక్ టాస్క్ఫోర్స్లో విధులు నిర్వర్తించవచ్చని తెలిపారు.
ట్రాఫిక్ టాస్క్ఫోర్స్ ప్రధాన విధులు
ట్రాఫిక్ టాస్క్ఫోర్స్ వద్ద ఉండే ఎక్విప్మెంట్స్
బృందాలు తిరిగే ప్రాంతాలు
మాదాపూర్, ఐకియా, రోటరీ-లెమన్ ట్రీ-మైండ్స్పేస్ నుంచి మళ్లీ ఐకియా రూట్లలో ట్రాఫిక్ టాస్క్ఫోర్స్ బృందాలు గస్తీ నిర్వహిస్తాయి. దీంతో పాటు జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 45నుంచి ఐటీసీ కోహినూర్ పరిసర ప్రాంతాల్లో టాస్క్ఫోర్స్ బృందాలు గస్తీ తిరుగుతాయి.