అబిడ్స్, ఆగస్టు5: సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. గన్ఫౌండ్రి డివిజన్ మాజీ కార్పొరేటర్ మమత సంతోష్ గుప్తా నేతృత్వంలో బీజేపీ నుంచి పలువురు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి మంత్రి మహమూద్ అలీ, టీఆర్ఎస్ గోషామహల్ నియోజకవర్గ ఇన్చార్జి ప్రేమ్సింగ్ రాథోడ్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
గన్ఫౌండ్రి డివిజన్ మాజీ కార్పొరేటర్ మమత సంతోష్ గుప్తా మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పేదల, మహిళల అభ్యున్నతికి విశేషంగా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. గోషామహల్ నియోజకవర్గ ఇన్చార్జి ప్రేమ్సింగ్ రాథోడ్ మాట్లాడుతూ..
పేదల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టిందని తెలిపారు. టీఆర్ఎస్లో చేరిన వారిలో సోనూసింగ్, ఎన్.దయానంద్, ఎన్.శ్రీకాంత్, సంజయ్ సింగ్, రాజేశ్ సింగ్, జయంతి లాల్, హేమంత్ కుమార్, ఆంథోని తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు అఖిల్ అహ్మద్, శ్రీనివాస్ యాదవ్, సురేశ్, నార్మన్ బాబు, జయశంకర్ తదితరులు పాల్గొన్నారు.