శేరి లింగంపల్లి, ఆగస్టు 5: ఔత్సాహిక స్టార్టప్లు, నూత న టెక్నాలజీ ఆధారిత ఆవిష్కరణలకు ప్రోత్సాహం అందించేందుకు ప్రముఖ మొబైల్ సంస్థ ‘ఒప్పో ఎలివేట్-2022’ పేరిట నిర్వహించిన ఇన్నోవేషన్ ఎక్స్లేటర్ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. శుక్రవారం నానక్రాం గూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని షెరటాన్ హోటల్లో ‘ఒప్పో ఎలివేట్’ 2వ ఎడిషన్ కార్యక్రమంలో డిజిటల్ హెల్త్లో ఔత్సాహిక స్టార్టప్లు, టెక్నాలజీ ఆధారిత అద్భుత ఆవిష్కరణలతో ఎంతో ఆసక్తితో పోటీలో పాల్గొన్నారు. దేశ వ్యాప్తంగా పలు స్టార్టప్లు పోటీలో నిలవగా 10 స్టార్టప్లు తమ ప్రతిపాదనలను పరిశ్రమకు చెందిన జ్యూరీ సభ్యులకు అందించే అవకాశాన్ని పొందాయి. శుక్రవారం 10 మంది స్టార్టప్ల లో భారతదేశంలో గెలిచే మొదటి నాలుగు విజేతలను ఎం పిక చేశారు. దీంతో ప్రపంచ స్థాయి ఫైనల్ పోటీల్లో తమ ఆవిష్కరణలను ప్రదర్శించి 46 వేల డాలర్ల ప్రైజ్మనీ గెలుచుకునే అవకాశాన్ని పొందాయి.
తమ వినూత్న ఆవిష్కరణలతో విజేతలుగా నిలిచిన నాలుగు స్టార్టప్ల నిర్వాహకులతో ఒప్పో సంస్థ వైస్ ప్రెసిడెంట్, ఆర్ అండ్ డీ హెడ్ తస్లీ మ్ హారిఫ్ సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ప్రముఖులు మధురిమ అగర్వాల్, అంకుజైన్, సందీప్ చక్రవర్తితో పాటు పలువురు స్టార్టప్ల నిర్వాహకులు, ఒప్పో సంస్థ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒప్పో ఎలివేట్ 2వ ఎడిషన్లో 10 స్టార్టప్లు పోటీలో పాల్గొన్నాయి. వీటిలో నాలుగు స్టార్టప్లు విజేతలుగా నిలిచాయి. భారతీయ యోగసాధనకు తగిన గుర్తింపు తెస్తూ యోగాప్రియుల కోసం ప్రత్యేక యాప్ సహాయంతో యోగా ట్రైనర్గా విలువైన సలహాలు, సూచనలు ఇస్తూ యోగా పద్ధతులు ఎలా చేయాలి? ఎం త చేయాలి? అనే విధానాలను చెప్పే ‘యోగిఫై’ స్టార్టప్ మొదటి స్థానంలో నిలిచింది.
కేవలం రూ.9 వేలకు లభించే యోగా మ్యాట్ ఈ తరహా విధానాన్ని అందిస్తున్నది. రెండో స్థానంలో పుట్టుకతో వినికిడి లోపం ఉన్న వారికి ఎలాంటి ఖరీదైన ఆపరేషన్ లేకుండా ఇంపు ల్స్ పేరిట ఆవిష్కరించిన చిన్న పాటి చెవి యంత్రంతో వినికిడి లోపాన్ని దూరం చేసే పరికరాన్ని కనుగొన్న ‘తింకర్ టెక్’ స్టార్టప్ నిలిచింది. మూడో స్థానంలో వినికిడి లో పం ఉన్నవారు కేవలం ప్రత్యేకంగా బ్యాక్యార్డ్ క్రియేటర్స్ స్టార్టప్ రూపొందించిన స్మార్ట్ విజన్ టెక్ కళ్లద్దాల ఆవిష్కరణ నిలిచింది.