జూబ్లీహిల్స్,ఆగస్టు 5: ఆట పాటల అంగన్వాడీ కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి. సంపన్నులు తమ పిల్లలను ప్లే స్కూల్లలో చదివించినట్లుగా పేదలు తమ చిన్నారులను మోడల్ అంగన్వాడీల్లో చేర్పించి మురిసిపోనున్నారు. అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేసి కొత్త భాష్యం చెప్పిన తెలంగాణ ప్రభుత్వం మోడల్ అంగన్వాడీ కేంద్రాల ఏర్పాటుతో సరికొత్త అధ్యాయం లిఖించనుంది. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహ్మత్నగర్ డివిజన్ ఆరోగ్యనగర్లో నాట్కో ట్రస్ట్ సౌజన్యంతో మోడల్ అంగన్వాడీ భవనాన్ని నిర్మించారు. తెలంగాణలోని 149 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 31,711 ప్రధానమైన అంగన్వాడీ కేంద్రాలతో పాటు 3,989 మినీ అంగన్వాడీ కేంద్రాలున్నాయి.
ఆయా అంగన్వాడీలకు సొంత భవనాలు సమకూర్చేందుకే కాక ఆయా కేంద్రాలను ఆదర్శంతంగా తీర్చిదిద్దేందుకు ఈ కేంద్రాన్ని ఆదర్శంగా తీసుకోనున్నారు. ఈ మేరకు రాష్ట్రంలోనే తొలి మోడల్ అంగన్వాడీ కేంద్రాన్ని రహ్మత్నగర్ డివిజన్లో నాట్కో ట్రస్ట్ సంస్థ సుమారు రూ.45 లక్షల వ్యయంతో నిర్మించారు. ఈ మోడల్ అంగన్వాడీ కేంద్రాన్ని శుక్రవారం జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్.. కార్పొరేటర్ సీఎన్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. రాష్ట్రంలో నూతన అంగన్వాడీలకు ఏర్పాటుకు మోడల్గా ఉండనున్న ఈ అంగన్వాడీ కేంద్రాన్ని మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్, జిల్లా సంక్షేమాధికారి అకేశ్వర్రావు, నాట్కో ట్రస్టీ స్వాతి చౌదరితో కలిసి సందర్శించారు.