అబిడ్స్, జూలై 31 : మాసాబ్ట్యాంక్లోని చాచా నెహ్రూ పార్క్లో అంపి థియేటర్ నిర్మాణ పనులు స్పీడందుకున్నాయి. థీమ్పార్క్లో భాగంగా పార్క్లో అంఫి థియేటర్, లైబ్రరీ బిల్డింగ్ బ్లాక్, కేఫ్టీరియా పనులు చేపడుతున్నారు. థీమ్ పార్క్ ఏర్పాటుకు రెండు కోట్ల రూపాయల నిధులు విడుదల కాగా ఆయా నిధులతో పనులు కొనసాగుతున్నాయి. రూ.60 లక్షల వ్యయంతో అంఫి థియేటర్ పనులు 80 శాతం పూర్తయ్యాయి. జీహెచ్ఎంసీ థీమ్ పార్క్లో భాగంగా చాచా నెహ్రూ పార్క్ను ఎంపిక చేసి ప్రతిపాదనలు పంపారు. నిధులు విడుదల కావడంతో పనులు ఇంజినీరింగ్ విభాగం అధికారుల పర్యవేక్షణలో జరుగుతున్నాయి. పార్క్కు వచ్చే సందర్శకులు ఓపెన్ థియేటర్లో పలు కార్యక్రమాలను నిర్వహించేందుకు వీలుగా నిర్మాణాలు జరుపుతున్నారు. ఏవైనా కార్యక్రమాలు ఉంటే వంద మంది నుంచి 120 మంది కూర్చుని వీక్షించేందుకు వీలుగా నిర్మాణాలు జరుపుతున్నట్లు జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ ఎస్ఈ సహదేవ్ రత్నాకర్ తెలిపారు. రౌండ్గా పది స్టెప్స్ను ఏర్పాటు చేసి మధ్యలో స్టేజీని నిర్మిస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతర కార్యక్రమాలను చేసుకునేందుకు ఈ అంఫి థియేటర్ అనుకూలంగా ఉంటుందన్నారు.
పనులు పూర్తి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ..
మాసాబ్ట్యాంక్ చాచా నెహ్రూ పార్క్లో అంఫి థియేటర్ పనులు పనులు పూర్తి కావస్తున్నాయి. మిగిలిన పనులను పూర్తి చేసేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఖైరతాబాద్ జోన్ ఎస్ఈ సహదేవ్ రత్నాకర్ పర్యవేక్షణలో ఇంజినీరింగ్ విభాగం అధికారులు పనులు పర్యవేక్షిస్తున్నారు. థీమ్ పార్క్ కార్యక్రమంలో భాగంగా అంఫి థియేటర్, లైబ్రరీ బిల్డింగ్ బ్లాక్, కేఫ్టీరియా, పౌండ్ మరమ్మతులు చేపడుతున్నారు. పనులన్నీ పూర్తైతే ఈ పార్క్ పూర్తి స్థాయి థీమ్ పార్క్గా మారనున్నది.
నాణ్యతతో పనులు జరిగేలా చర్యలు
పనులు నాణ్యతతో జరిగేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. థీమ్ పార్క్ కార్యక్రమంలో భాగంగా చాచా నెహ్రూ పార్క్ను ఎంపిక చేసి అంఫి థియేటర్తో పాటు సంబంధిత మరమ్మతులు జరుగుతున్నాయి. నిధులు విడుదల కావడంతో పనులు శరవేగంగా సాగుతున్నాయి. త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకు వచ్చేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం.
– సహదేవ్ రత్నాకర్, జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ ఎస్ఈ