ఘట్కేసర్,జూలై 18 : ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని ఘట్కేసర్ మున్సిపాలిటీ కమిషనర్ వసంత తెలిపారు. హరితహారంలో భాగంగా మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు కౌన్సిలర్ చందుపట్ల వెంకట్రెడ్డి ఎలైట్ హోమ్స్ పార్కులో, 2వ వార్డు కౌన్సిలర్ కొమ్మగోని రమాదేవి మైపాల్గౌడ్ లక్షీనగర్లో కమిషనర్తో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ముందు చూపుతో చేపట్టిన హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు గోపాల్రెడ్డి, సత్యనారాయణ గౌడ్, 2వ వార్డు టీఆర్ఎస్ అధ్యక్షుడు యాదగిరి, మాజీ వార్డు సభ్యురాలు మంజుల, శశికళ, లలిత, శివ, మనుకుమార్, పుష్ప పాల్గొన్నారు.
హరితహారంలో భాగస్వాములు కావాలి
హరితహారం కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములయ్యే విధంగా స్థానిక నేతలు కృషి చేయాలని మండల పంచాయతీ అధికారి మంగతాయారు తెలిపారు. మండల పరిధిలోని పలు గ్రామాల్లో సోమవారం ఆయా గ్రామాలకు చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు కలిసి ఇంటింటికీ తిరిగి మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీవో మాట్లాడుతూ హరితహారం కార్యక్రమాన్ని సక్సెస్ చేయాల్సిన బాధ్యత మనందరి పై ఉందన్నారు. హరితహారంను సక్సెస్ చేయడానికి అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు.