సిటీబ్యూరో, జూలై 5 (నమస్తే తెలంగాణ): వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్ఆర్డీపీ)లో భాగంగా కొత్తగా 42 చోట్ల రోడ్ ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ), రోడ్ అండర్ బ్రిడ్జి (ఆర్యూబీ) నిర్మాణ పనులను చేపట్టాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఎన్నో ఏండ్లుగా రైల్వే క్రాసింగ్ల వద్ద వాహనదారులు, పాదచారులు పడుతున్న కష్టాలకు శాశ్వత చెక్ పెట్టాలని ఇటీవల రైల్వే శాఖతో కలిసి చర్చించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం ఉండేలా ఆర్యూబీలపై ప్రధానంగా దృష్టి సారించారు. ఇందులో భాగంగానే 42 చోట్ల నిర్మాణ పనుల సాధ్యాసాధ్యాలపై ఇంజినీర్ల బృందం అధ్యయనం చేస్తున్నది. క్షేత్రస్థాయిలో ఆర్వోబీ.. లేదంటే ఆర్యూబీ అవకాశం ఉందా..? ప్రాజెక్టు వ్యయం..! తదితర అంశాలపై క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేస్తున్నారు. త్వరలోనే డిటేల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) రూపొందించి, ఆ ప్రతిపాదనలను ప్రభుత్వానికి అందజేస్తామని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
ఆర్యూబీలు: చిలకలగూడ, మాణికేశ్వర్నగర్, విద్యానగర్, తిలక్నగర్ (ఫీవర్ దవాఖాన), నింబోలిఅడ్డా, కాచిగూడ, యాకుత్పుర , భవానీనగర్, లలిత్బాగ్, చౌనీ , ఖైరతాబాద్ రైల్వే గేట్ , ఖైరతాబాద్ ఐసీఐసీఐ, ఎంఎస్. మక్తా రాజ్భవన్ రోడ్ , నేచర్ క్యూర్ హాస్పిటల్, పాటిగడ్డ , హఫీజ్పేట రైల్వేట్రాక్ , యూసుఫ్గూడ గాయత్రినగర్ , సనత్నగర్, ఎల్బీనగర్ బాబానగర్, సికింద్రాబాద్ గౌతంనగర్ , కూకట్పల్లి వెస్ట్ వెంకటాపురం.
ఆర్వోబీలు: శివరాంపల్లి, గగన్పహాడ్, నాంపల్లి రైల్వేస్టేషన్, డీజీపీ ఆఫీస్ లక్డీకాపూల్, చందానగర్, సైబర్ వ్యాలీ, శేరిలింగంపల్లి, హఫీజ్పేట వసంత్ సిటీ, ఉప్పర్గూడ (రైల్వేక్రాసింగ్), ఎన్ఎఫ్సీ మల్లాపూర్ క్రాస్రోడ్, భరత్నగర్ చర్లపల్లి, సఫిల్గూడ(లెవల్క్రాసింగ్), బొల్లా రం, తుర్కపల్లి, కూకట్పల్లి బీహెచ్ఈఎల్ కాలనీ, కూకట్పల్లి కిష్టమ్మ ఎన్క్లేవ్, వాజ్పేయినగర్ (లెవల్ క్రాసింగ్), కాకతీయనగర్ (లెవల్ క్రాసింగ్), వినాయక్నగర్ (లెవల్ క్రాసింగ్).