హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): స్వతంత్ర భారత చరిత్రలో ఏ ప్రభుత్వమూ అమలు చేయనన్ని సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు అమలు చేస్తున్నారని, ఆ పథకాల ద్వారా రాష్ట్రంలోని అన్ని కుటుంబాలూ లబ్ధి పొందుతున్నాయని మంత్రి కె.తారకరామారావు తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి ఆదిలాబాద్ జిల్లాలోని ముక్రా (కే) గ్రామమే ముఖచిత్రమని పేర్కొన్నారు. సర్పంచ్ మీనాక్షి గాడ్గే ఆధ్వర్యంలో ‘ప్రతి ఇంటికీ సంక్షేమం- ప్రతి ఇంటికీ కేసీఆర్’ పేరుతో వినూత్న ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులు మంగళవారం ప్రగతిభవన్లో మంత్రి కేటీఆర్ను కలిశారు. మంత్రిని కలిసినవారిలో స్థానిక ఎంపీటీసీ సుభాష్ గాడ్గే తదితరులు ఉన్నారు.