ముషీరాబాద్, జూలై 5 : రాంనగర్ రామాలయం వీధి, ఆదర్శకాలనీల్లో మురుగు నీటి సమస్యకు త్వరలోనే పరిష్కారం చూపుతామని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జలమండలి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన జలమండలి అధికారులతో కలిసి ముషీరాబాద్ డివిజన్ రాంనగర్ రామాలయం వీధి, ఆదర్శ కాలనీలో పర్యటించారు. స్థానికంగా తలెత్తుతున్న డ్రైనేజీ సమస్యకు గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్న ఆయన వెంటనే పరిష్కరించాలని సూచించారు. చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్న ఆదర్శకాలనీ మురుగు నీటి సమస్యను సాధ్యమైనంత తొందరగా పరిష్కరిస్తామన్నారు. ఇప్పటికే చాలా వరకు డ్రైనేజీ సమస్యను పరిష్కరించామని, వరద నీటి నాలాలో పూడిక తొలగించి సమస్యను పరిష్కరించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా రాంనగర్ రామాలయం వీధిలో గతంలోనే డ్రైనేజీ పైపులైన్ ఏర్పాటు కోసం నిధులు మంజూరు చేశామని, మరోసారి పరిశీలించి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జలమండలి జీఎం శ్రీధర్రెడ్డి, డీజీఎం వాహబ్, టీఆర్ఎస్ పార్టీ యూత్ విభాగం నేత ముఠా జయసింహ, ముషీరాబాద్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కాడబోయిన నర్సింగ్ ప్రసాద్, ప్రధాన కార్యదర్శి ఆకుల అరుణ్కుమార్, శ్రీధర్రెడ్డి, లక్ష్మణ్ గౌడ్, ముచ్చకుర్తి ప్రభాకర్, నేత శ్రీనివాస్, దీన్దయాల్రెడ్డి, బి.శ్రీనివాస్రెడ్డి, లింగాల శ్రీకాంత్ గౌడ్, గోరఖ్నాథ్, రవియాదవ్, సత్యనారాయణ, బాల్రాజ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
బోనాలకు నిధుల మంజూరుకు కృషి
బోనాల పండుగకు నిధుల మంజూరుకు తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. మంగళవారం ముషీరాబాద్ మహంకాళీ దేవాలయం మాజీ చైర్మన్ ఎయిర్టెల్ రాజు, ఆలయ కార్యనిర్వహణాధికారి కె.సాంబశివరావు, పూజారి వై. చంద్రమౌళి, ఆలయ కమిటీ సభ్యుడు మాదేశి రాజేందర్లు హైదర్గూడలోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లోని ఆయన నివాసంలో కలిసి బోనాల పండుగకు హాజరు కావాలని ఆహ్వనించినట్లు వారు తెలిపారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే బోనాల పండుగకు నిధులు మంజూరుతోపాటు ఉత్సవాలకు హాజరవుతానని హామీ ఇచ్చినట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు వెల్లడించారు. అనంతరం ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించినట్లు వారు తెలిపారు.