మల్కాజిగిరి, జూలై 5: దివ్యాంగులు, వృద్ధులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. మంగళవా రం మల్కాజిగిరి సర్కిల్లోని బాలాజీ ఫంక్షన్ హాల్లో ఉపకరణాల కోసం దివ్యాంగులు, వృద్ధు ల ఎంపిక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మా ట్లాడు తూ.. జీహెచ్ఎంసీ, అలింకో సంస్థ సమన్వయం తో మల్కాజిగిరి నియోజకవర్గంలోని దివ్యాంగులు, వృద్ధులకు ఉచితంగా ఉపకరణాలను అందజేయడానికి ఎంపిక ప్రక్రియ చేపట్టామని అన్నారు. పరికరాలు బ్రెయిలీ కిట్, ఎంఎస్ఐఈడీ కిట్, ఎంఆర్ కిట్, క్రచ్ ఎల్బో పరికరం, సంక కర్ర, బ్రెయిలీ కేన్, డీలక్స్, రోల్టెర్స్, స్మార్ట్ కేన్, డైసీ ప్లేయిర్, ఏడియల్ కిట్(లెప్రసి), సర్వేకల్ కాలర్స్, వీల్ చైర్, ఎల్ఎన్ బెల్ట్, ట్రై సైకిల్, సీపీ చైర్, వినికిడి యంత్రం, క్యాలిపర్స్ మరియు కృత్రిమ అవయవాలు క్యాంపు లో గుర్తించినవారికి అందజేయనున్నామని అన్నా రు. అలాగే.. దివ్యాంగులు, వృద్ధులకు నెలనెలా పింఛన్ అందజేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో డీసీ రాజు, పీఓ మల్లికార్జున్, కార్పొరేటర్లు ప్రేమ్కుమార్, సునీతారాముయాదవ్, రాజ్యలక్ష్మి, నా యకులు మీడియా ఇన్చార్జి గుండా నిరంజన్, రాముయాదవ్, మోహన్ రెడ్డి, నర్సింగ్రావు, జంగరాజు, వైశాలి, కవిత పాల్గొన్నారు.
అర్హులందరికీ ఉపకరణాలు..
దివ్యాంగులు, వృద్ధులు ఇబ్బందులు పడకుండా వారికి అవసరమైన పరికరాలు అందజేస్తున్నామని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. మంగళవారం ఆయన అల్వాల్ సర్కిల్ ఇందిరానగర్ కమ్యూనిటీ హాల్లో అలింకో, జీహెచ్ఎంసీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన గుర్తింపు శిబిరాన్ని అల్వాల్ కార్పొరేటర్ శాంతిశ్రీనివాస్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అర్హులైన దివ్యాంగులు, వృద్ధులు తమ పత్రాలను సమర్పిస్తే వాటిని పరిశీలించి, వారికి కావాల్సిన ఉపకరణాలు, కృత్రిమ అవయవాలు అందజేయనున్నట్లు తెలిపారు. మరోవైపు శిబిరానికి వచ్చిన దివ్యాంగులతో కార్పొరేటర్ మా ట్లాడి, వారి సమస్యను తెలుసుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ డీసీ నాగమణి, అధికారులు సుజాత, రజినీ, సురేశ్, నాయకులు అనిల్కిశోర్, లోకేశ్, శ్రీనివాస్, బబిత, కవిత, జ్యోతి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.