బాలానగర్, జూలై 5: బాలానగర్లో ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చి నేటితో ఏడాది పూర్తయ్యింది. గతేడాది జూలై 6వ తేదీన రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఫ్లైఓవర్ను అందుబాటులోకి తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. స్టాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం(ఎస్ఆర్డీపీ)లో భాగంగా బాలానగర్లో రూ. 387కోట్ల వ్యయంతో ఫ్లైఓవర్ పనులకు 2017 ఆగస్టు 21వ తేదీన శంకుస్థాపన చేయగా 2018 ఏప్రిల్ 21న పనులు చేపట్టారు. బాలానగర్ ఫ్లైఓవర్ 3 సంవత్సరాల 10 నెలల కాల వ్యవధిలో పనులు పూర్తి చేసుకొని ప్రజలకు అందుబాటులోకి రావడంతో ప్రయాణం సాఫీగా సాగుతున్నది.