కుత్బుల్లాపూర్/దుండిగల్,జూలై5: ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే వివేకానంద్ అన్నారు.సూరారం డివిజన్ నెహ్రునగర్లో స్థానికంగా నెలకొన్న సమస్యలపై మంగళవారం ఎమ్మెల్యే పాదయాత్ర నిర్వహించారు. తాగునీటి సరఫరాలో ఇబ్బందులు ఉన్నాయని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి పరిష్కరించాలని ఆదేశించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులున్నా తన దృష్టికి తీసుకురావాలని,వాటి పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకుంటానన్నారు.ఇప్పటికే డివిజన్లో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు పూర్తి చేశామని,మరిన్ని ప్రాంతాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ,తాగునీటి పైపులైన్ పనులను చేపట్టనున్నామని పేర్కొన్నారు.ఎమ్మెల్యే వెంట డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు భాస్కర్,ప్రధాన కార్యదర్శి సిద్దిక్,నాయకులు ఫెరోజ్, మధుమోహన్, దశరథ్ తదతరులు ఉన్నారు.
జర్నలిస్టుల సంక్షేమానికి కృషి
టీఆర్ఎస్ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఎమ్మెల్యే వివేకానంద్ అన్నారు.సూరారంలోని శివాలయనగర్ అంబేద్కర్ భవనంలో మంగళవారం జరిగిన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ల ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ద్వితీయ మహాసభలకు హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను అసెంబ్లీలో ప్రసావించి పరిష్కారానికి కృషి చేస్తానని, పెండింగ్లో ఉన్న అక్రిడేషన్ కార్డులు,హెల్త్ కార్డులను మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి బసవ పున్నయ్య, కోశాధికారి ఆనంద్, మెరుగు చంద్రమోహన్,స్థానిక రిపోర్టర్లు తదితరులు ఉన్నారు.
క్యాంపు కార్యాలయానికి ప్రజల తాకిడి
పేట్ బషీరాబాద్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి మంగళవారం నియోజకవర్గానికి చెందిన పలువురు కాలనీల అసోషియేషన్ సభ్యులు, ప్రజలు తమ సమస్యలపై నేరుగా ఎమ్మెల్యేకు వివరించేందుకు వచ్చారు.దీంతో సంబంధిత అధికారులతో ఫోన్లైన్లో మాట్లాడి సమస్యలు పరిష్కరించేలా ఎమ్మెల్యే చేశారు.
132 జీడిమెట్ల డివిజన్ రాఘవేంద్రకాలనీలో రూ.26 లక్షల నిధులతో వరదనీటి సమస్యకు శాశ్వత పరిష్కానికి కృషి చేసి కాలువ నిర్మాణాన్ని పూర్తి చేయించిన సందర్భంగా కాలనీ అసోషియేషన్ ప్రతినిధులు ఎమ్మెల్యేను కలిసి సన్మానించారు. అనంతరం మిగిలి ఉన్న సీసీరోడ్లు, డ్రైనేజీ, పార్క్ అభివృద్ధి పనులను చేపట్టాలని వినతిపత్రాన్ని అందించారు. కార్యక్రమంలో కాలనీ వేల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీకాంత్, కోశాధికారి ఉమాపతిరావు, జి.రవీందర్రెడ్డి, ఎం.రవీందర్రెడ్డి, బి.నారాయణరావు తదితరులు ఉన్నారు.
దుండిగల్ మున్సిపాలిటీ 28వ వార్డులో భూగర్భడ్రైనేజీ, సీసీరోడ్లు, బస్తీదవాఖాన ఏర్పాటుకు కృషి చేయాలని కోరుతూ సీనియర్ నాయకులు సుధాకర్ ఆధ్వర్యంలో స్థానికులు ఎమ్మెల్యేను కలిశారు.
132 జీడిమెట్ల డివిజన్ వినాయక్నగర్కు చెందిన సంక్షేమ సంఘం ప్రతినిధులు ఎమ్మెల్యేను కలిసి కాలనీలో అంతర్గత రోడ్లు, డ్రైనేజీతో పాటు ఇతర అభివృద్ధి పనులపై ఎమ్మెల్యేకు వినతిపత్రాన్ని అందించారు.
కుత్బుల్లాపూర్ డివిజన్ శ్రీరామ్నగర్ కాలనీలో భూములపై డిఫెన్స్ జోక్యంపై ఎమ్మెల్యేను కలువడంతో విషయాన్ని కలెక్టర్ దృష్టికి ఫోన్లైన్ ద్వారా తీసుకెళ్లారు. సమస్య పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
సూరారం డివిజన్ నెహ్రూనగర్లో జగదాంబ దేవి, సేవాలాల్ బోనాల ఉత్సవాల్లో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్యఅతిథిటీ భాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, ఉత్సవ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.
సూరారం 129 డివిజన్ నెహ్రూ నగర్లో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పర్యటించి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీల్లో మెరుగైన వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.