మెహిదీపట్నం జూన్ 30: తెలంగాణ ఆషాఢ మాసం బోనాల జాతర గురువారంతో షురూ అయ్యింది. చారిత్రక గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబ అమ్మవారికి భక్తులు తొలిబోనం సమర్పించారు. ఈ సందర్భగా అమ్మవారికి భక్తుల భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. దీంతో కోటలోభక్తుల సంద డి నెలకొంది. పోతరాజుల విన్యాసాలు పలువురిని ఆకట్టుకున్నాయి. కోటపై వరకు తొట్టెలను ఊరేగించి ఆధ్యాంత ఆకట్టుకుంది.
నగర పోలీస్ కమిషనర్ సీవీ,ఆనంద్ పర్యవేక్షణలో పశ్చిమ మండలం డీసీపీ జోయల్ డేవిస్,అదనపు డీసీపీ ఇక్బాల్ సిద్ధికి,ఆసిఫ్నగర్ ఏసీపీ ఆర్జీ,శివమారుతిలు తమ సిబ్బందితో కలిసి బందోబస్తును నిర్వహించారు.
కోటకు బోనాలకు వచ్చిన భక్తులకు నీటి ఇబ్బందులు లేకుండా జలమండలి జీఎం నాగేందర్కుమార్ ఆధ్వర్యంలో డీజీఎం జవహర్ అలీ నీటి ఏర్పా ట్లు చేపట్టారు. తొలిపూజ సందర్భంగా భక్తులు అమ్మవారికి బోనాలను సమర్పించారు.కులవృత్తుల వారు సంఘం అధ్యక్షులు సాయిబాబాచారి ఆధ్వర్యంలో భక్తులకు సేవలను అందచేశారు.గోల్కొండలో బోనాల ఊరేగింపుసందర్భంగా మతసామరస్యం కనిపించింది.