సిటీబ్యూరో, జూన్ 23(నమస్తే తెలంగాణ): ఇస్రో ఆధ్వర్యంలో యువికా కార్యక్రమంపై ఈ నెల 27న మధ్యాహ్నం 2 గంటలకు టీ శాట్ నెట్వర్క్ ద్వారా టెలీ కాన్ఫరెన్స్ ఉంటుందని జిల్లా విద్యాధికారిణి ఆర్.రోహిణి తెలిపారు.
జిల్లాలోని అన్ని యాజమాన్యాలకు చెందిన స్కూళ్లలో 6 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న యువ శాస్త్రవేత్తల్లో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ ఆదేశాల ప్రకారం, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఈ మేరకు డిప్యూటీఈవోలు, ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు అనుమానాలను సైన్స్ ఉపాధ్యాయులు నివృత్తి చేయాలన్నారు.