ఎల్బీనగర్, జూన్ 21: పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. మంగళవారం లింగోజిగూడ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారులకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పార్టీ ప్రతిష్టకు కృషి చేయాలని సూచించారు. అభివృద్ధిలో ఎల్బీనగర్ నియోజకవర్గం ముందంజలో ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాస్రావు, డివిజన్ అధ్యక్షుడు వరప్రసాద్రెడ్డితో పాటు డివిజన్లోని టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కృతిమ అవయవాలు ఉచితంగా అందజేస్తున్నాం
హయత్నగర్ సర్కిల్ పరిధిలోని దివ్యాంగులు, వయోవృద్ధులకు జీహెచ్ఎంసీ, అలింకో సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా అందజేయనున్న కృతిమ అవయవాలు, వినికిడి పరికరాలకు అర్హులైన వారిని గుర్తించేందుకు మంగళవారం నాగోల్ డివిజన్ కోఆపరేటివ్ బ్యాంకు కాలనీ కమ్యూనిటీ హాల్లో శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన దివ్యాంగులు, వయోవృద్ధులకు ఉచితంగా వాకింగ్ స్టిక్స్, వినికిడి యంత్రం, వీల్చైర్స్, స్మార్ట్ క్యాన్, సీపీ చైర్ తదితర పరికరాలు ఇవ్వబడుతాయని తెలిపారు. ఈ అవకాశాన్ని దివ్యాంగులు, వృద్ధులు వినియోగించుకొని తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. దివ్యాంగులు, వృద్ధులు తమ లోపాలకు చెందిన సర్టిఫికెట్లతో పాటు ఇతర డాక్యుమెంట్లను సంబంధిత అధికారులకు అందజేయాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్లు మారుతీ దివాకర్, సురేందర్ రెడ్డి, కృష్ణవేణి, నాయకులు అనంతుల రాజిరెడ్డి, తూర్పాటి చిరంజీవి, చెరుకు ప్రశాంత్గౌడ్, సుర్వి రాజుగౌడ్, భాస్కర్యాదవ్ తదితరులు పాల్గొన్నారు.