ఎల్బీనగర్, జూన్ 17: పరిసరాల శుభ్రతపై దృష్టి సారించాలని ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్త అన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా కొత్తపేట డివిజన్లోని శ్రీనివాస కాలనీ, శివగంగా కాలనీల్లో పర్య టించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దయానంద్ గుప్త మాట్లాడుతూ పట్టణాలను అన్ని హంగులతో అభివృద్ధి పథంలో నడిపించేందుకే ప్రభుత్వం పట్టణ ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. వర్షాకాలంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో కొత్తపేట డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు లింగాల రాహుల్గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ విశ్వేశ్వర్రావు, బొగ్గారపు వరుణ్, శ్రీనివాస కాలనీ అధ్యక్షుడు ఏర్పుల గాలయ్య, శివగంగా కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మల్లేశ్ గౌడ్, శ్రీరాములు, చక్రవర్తి, మల్లెపాక యాదగిరి, జోగు రాములు, రమావత్ దీప్లాల్, హరిశంకర్, భీమ్రాజ్, భీమయ్య, రాములు, యాసిన్ పాల్గొన్నారు.
చైతన్యపురి డివిజన్లో..
చైతన్యపురి డివిజన్లోని ప్రభాత్నగర్ కాలనీలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ సిబ్బందితో కలిసి చైతన్యపురి డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు తోట మహేశ్యాదవ్, డివిజన్ మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ జయశ్రీ తో పాటుగా స్థానిక కాలనీవాసులు పాల్గొని పారిశుధ్య పనులు నిర్వహించారు. కాలనీల్లోని చెత్తను తొలగించడంతో పాటుగా డెబ్రీస్ క్లీనింగ్ పనులను నిర్వహించారు. నాయకులు మహేందర్, రమణ, శ్రీశైలం యాదవ్, జీహెచ్ఎంసీ సిబ్బంది నర్సింహ, శ్రీరాములు, రమేశ్ పాల్గొన్నారు.
ఆదిత్యనగర్కాలనీలో…
పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ సమస్యలను పరిష్కరిస్తున్నామని జీహెచ్ఎంసీ హయత్నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ మారుతి దివాకర్ తెలిపారు. మన్సూరాబాద్ డివిజన్ ఆదిత్యనగర్కాలనీలో శుక్రవారం నిర్వహించిన నాల్గో విడుత పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యలను ఒకవైపు పరిష్కరిస్తూనే కాలనీల పరిశుభ్రతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. కాలనీవాసులు రోడ్లపై చెత్తాచెదారం ఇష్టానుసారంగా వేయకుండా ఇంటి ముందుకు వచ్చే ఆటోరిక్షాల్లోనే వేయాలని సూచించారు. కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ పున్యానాయక్, కాలనీ అధ్యక్షుడు మోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.